MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తిరుప‌తి తొక్కిస‌లాట‌లో న‌లుగురు భ‌క్తులు మృతి.. అసలు ఏం జరిగింది?

తిరుప‌తి తొక్కిస‌లాట‌లో న‌లుగురు భ‌క్తులు మృతి.. అసలు ఏం జరిగింది?

Tirupati stampede: తిరుపతిలో తొక్కిసలాటలో న‌లుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. తిరుపతి విష్ణు నివాసంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు పంపిణీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 08 2025, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Tirupati stampede: తిరుప‌తిలో తొక్కిస‌లాట‌లో న‌లుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో న‌లుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయ‌ని స‌మాచారం.

శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు వద్ద తోపులాటలు కారణంగా తొక్కిసలాటలు జరిగాయి. బైరాగిపట్టెడ వద్ద తోపులాటలో భక్తులకు గాయపడగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో పోలీసులు, తోటి భక్తులు CPR చేసి వారిని రక్షించే ప్రయత్నం చేశారు.
 

25
tirumala tirupati stampede

tirumala tirupati stampede

భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట

తిరుపతి విష్ణు నివాసంలో టోకెన్ల పంపిణీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఒకరు తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిక కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 10న పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి టోకెన్ల పంపిణీ కోసం అలిపిరి, శ్రీనివాసపురంతో పాటు ఇతర ప్రాంతాలలో తొమ్మిది కేంద్రాలలో 94 కౌంటర్లను తెరిచింది. దీంతో వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల కోసం తిరుమలకు భక్తులు భారీగా వ‌స్తున్నారు. 

గురువారం ఉదయం 5 గంటల నుంచి దర్శన టికెట్లను ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఏపీ, తెలంగాణ‌ల‌తో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా చాలా భ‌క్తులు తిరుప‌తికి వ‌చ్చారు. ఎక్కువ సంఖ్య‌లో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లలోకి ప్రవేశించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. దీంతో న‌లుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోవ‌డంతో పాటు ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

35

భ‌క్తుల మృతిపై సీఎం చంద్ర‌బాబు దిగ్భ్రాంతి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు  మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చెప్పారు.

ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో సిఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టిటిడి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలనీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

45
tirupati

tirupati

టిక్కెట్ల జారీ నిర్వహణలో లోపాలే కారణమా?

తిరుప‌తి వెంక‌న్న వైకుంఠ ద్వారం ద‌ర్శ‌నం కోసం భారీగా భ‌క్తులు వ‌స్తారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మూడు రోజులలో (జనవరి 10, 11,12) ఎనిమిది ప్రదేశాలలో ద‌ర్శ‌నం టోకెన్ల పంపిణీని ప్రకటించింది. టీటీడీ పెట్రోలింగ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో భ‌క్తులు టోకెన్ల కోసం వ‌చ్చారు. దీంతో రద్దీని నియంత్రించడం కష్టమైంది. దీంతో తొక్కిస‌లాట జ‌రిగింది. భద్రతా చర్యల సమర్ధతపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.

55

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు -భారీగా భ‌క్తుల రాక‌ 

వైకుంఠ ఏకాద‌శి నేప‌థ్యంలో ప్రత్యేక దర్శనం ద్వారా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. చెల్లుబాటు అయ్యే టోకెన్ హోల్డర్లను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. రద్దీని నియంత్రించడానికి కఠినమైన చర్యలను ప్రకటించింది.

ఈ విషాదం 10 రోజుల పండుగ వేడుక‌ల కోసం తమ ప్రణాళికల విష‌యంలో మ‌ళ్లీ పునరాలోచించేలా అధికారులను ప్రేరేపించింది. ఇప్పుడు అదనపు టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ప్రోటోకాల్‌ల గురించి భక్తులకు హామీ ఇచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Recommended image2
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Recommended image3
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved