MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirumala : ఇక మతమార్పిడులకు చెక్.. టిటిడి మాస్టర్ ప్లాన్, ఏం చేయబోతున్నారో తెలుసా?

Tirumala : ఇక మతమార్పిడులకు చెక్.. టిటిడి మాస్టర్ ప్లాన్, ఏం చేయబోతున్నారో తెలుసా?

Tirumala : మతమార్పిడులను నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల టిటిడి బిగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటో తెలుసా?   

2 Min read
Arun Kumar P
Published : Sep 27 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టిటిడి మాస్టర్ ప్లాన్
Image Credit : Getty

టిటిడి మాస్టర్ ప్లాన్

Tirumala : ఆంధ్ర ప్రదేశ్ లో మతమార్పిడులను నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పూనుకుంది. ఇందులో భాగంగానే దళితులకు ఆ దేవుడిని దగ్గర చేసేందుకు భారీ ఆలయాల నిర్మాణాానికి సిద్దమయ్యింది. దళిత కాలనీల్లో దాదాపు 5 వేల దేవాలయాల నిర్మించాలని ఇటీవల టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టిటిడి నిర్ణయానికి ఆమోదం తెలపడంతో ఆలయాల నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.

25
గత ఐదేళ్లలో అత్యధిక మతమార్పిడులు
Image Credit : Getty

గత ఐదేళ్లలో అత్యధిక మతమార్పిడులు

తాజాగా టిటిడి మతమార్పిడుల నియంత్రణకోసం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బిజెపి అధికార ప్రతినిధి సాధినేని యామిని స్వాగతించారు. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా మతమార్పిడులు జరిగాయని… ఈ సమయంలో వెయ్యికి పైగా అక్రమ చర్చిలు నిర్మించారని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో హిందువులను క్రైస్తవంలోకి మార్చడమే దీని ఉద్దేశమని యామిని శర్మ అన్నారు.

Related Articles

Related image1
Tirumala : ఏమిటీ..! బక్కపల్చని ఈ వృద్ధుడు ఏడుకొండలను 2600 సార్లు ఎక్కిదిగాడా.. స్వామిని 3350 దర్శించుకున్నాడా..!!
Related image2
Tirumala : తిరుపతిలో పరిస్థితి ఇంత దారుణమా : ఇది ఓ శ్రీవారి భక్తుడి ఆవేదన
35
దళిత వాడలకే దేవుడు
Image Credit : TTD Website

దళిత వాడలకే దేవుడు

సుమారు 5 వేలకు పైగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ దళిత వాడల్లో నిర్మించాలన్న టిటిడి నిర్ణయం అద్భుతమన్నారు యామిని. ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనే మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణంతో హిందువులను ఏకం చేసే పని జరుగుతుంది. అందరికీ ఆ స్వామిని ప్రార్థించే అవకాశం లభిస్తుందని అన్నారు.

45
దేవాలయాన్ని నిర్మాణాన్ని వ్యతిరేకించేవారిపై యామిని సీరియస్
Image Credit : TTD Website

దేవాలయాన్ని నిర్మాణాన్ని వ్యతిరేకించేవారిపై యామిని సీరియస్

హిందూ దేవాలయాల నిర్మాణానికి టిటిడి నిధులు కేటాయిస్తే ఈ డబ్బులతో స్కూళ్లు, లేదా హాస్పిటల్స్ కడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కొందరు సోకాల్డ్ సెక్యులరిస్టు లెక్చర్ ఇస్తున్నారని యామిని గుర్తుచేశారు. ఇలాంటివారు ప్రజాధనంతో ఇమామ్ లకు జీతాలు, హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వడాన్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. టిటిడి ఓ హిందూ ధార్మిక సంస్థ... ఇది తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని సాధినేని యామిని అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం హిందూ భక్తుల విరాళాలనే ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తుందని యామిని అన్నారు. అందులో భాగంగానే ఎస్సి, ఎస్టి కాలనీల్లో 5000 ఆలయాల నిర్మాణానికి పూనుకుంటోందని తెలిపారు. బయటివారు ఎవ్వరికీ దీనిని ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ఇప్పటికే టిటిడి సమాజంకోసం ఎంతో చేసిందని... దశాబ్దాలుగా రుయా, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్ ద్వారా వైద్యం అందించడమే కాదు పలు విద్యాసంస్థలకు ఆర్థికసాయం చేస్తుందని అన్నారు. కాబట్టి హిందుత్వ వ్యతిరేకులు టిటిడి గురించి అరవడం ఆపాలని సాధినేని యామిని ఘాటు కామెంట్స్ చేశారు.

🚩🚩Stop poking into Hindu funds — dare to question subsidies, haj tours, and imam salaries paid from public taxes.🚩
———-
With TTD’s decision to construct 5,000 temples in SC/ST colonies, a gang of so-called “secularists” and anti-Hindu loudmouths instantly began lecturing TTD…

— Sadineni Yamini Sharma (@YaminiSharma_AP) September 27, 2025

55
టిటిడి కీలక నిర్ణయం
Image Credit : Getty

టిటిడి కీలక నిర్ణయం

భారతీయ జనతా పార్టీ మతమార్పిడులను తీవ్రంతా వ్యతిరేకిస్తుంది.. కాబట్టి టిటిడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) దళిత వాడల్లో 800కు పైగా ఆలయాలను స్థాపించిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మతమార్పిడుల నియంత్రణకు అన్ని విధాలా కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తమకుందని బిజెపి నాయకురాలు యామిని శర్మ అన్నారు.

VIDEO | Vijayawada: “Establishing over 5000 Lord Balaji temples in Dalit colonies will stop illegal conversions”, says BJP leader Sadineni Yamini Sharma (@YaminiSharma_AP) welcoming CM Chandrababu Naidu's plan on build 5,000 Venkateswara Temples in SC/ST colonies.#AndhraPradesh… pic.twitter.com/X56CG5DSCV

— Press Trust of India (@PTI_News) September 26, 2025

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved