MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirupati: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్

Tirupati: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్

Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.  

1 Min read
Mahesh Rajamoni
Published : May 13 2025, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Tirumala Tirupati Devasthanam (TTD): తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధుల వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సులను తిరిగి స్వీకరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎండోమెంట్స్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  మీడియా ద్వారా సమాచారం అందించారు.

26
Tirumala

Tirumala

అత్యవసర దర్శనం అవకాశంగా పరిగణించే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ మే 15వ తేదీ నుంచి స్వీకరిస్తుంది. ఈ సిఫార్సులతో వచ్చే భక్తులకు మే 16వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించనున్నార‌ని తెలిపారు.

Related Articles

Related image1
weather: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు అల‌ర్ట్
Related image2
Miss world 2025: ఓల్డ్ సిటీలో సంద‌డి చేసిన సుంద‌రాంగులు.. హెరిటేజ్ వాక్
36

గతంలో వేసవి సెలవుల నేపథ్యంలో మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో ప్రోటోకాల్ వీఐపీ లకు మాత్రమే దర్శన అనుమతి ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ బోర్డు తాజా సమీక్షలో భాగంగా మే 15 నుంచి ప్రజాప్రతినిధుల లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలను మళ్లీ ప్రారంభించనుంది.

46

అయితే, టీటీడీ అధికారులు స్పష్టం చేసిన విషయం ఏమంటే.. ఇతర అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. వీఐపీ దర్శనానికి సంబంధించిన కోటా పరిమితి, టైమ్ స్లాట్‌లు, గుర్తింపు ధ్రువీకరణలు వంటి అంశాల్లో ఎటువంటి మార్పులు లేవు.

56

భక్తులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బ్రేక్ దర్శనానికి వచ్చేటప్పుడు, ఉన్నతాధికారుల నుండి వచ్చిన లేఖ, భద్రతా ప్రమాణాలతో కూడిన గుర్తింపు కార్డు వంటివి తప్పనిసరిగా తీసుకురావలసి ఉంటుంది.

 

66

ఈ మార్పుతో తిరుమలలో వచ్చే వారాల వ్యవధిలో వీఐపీ బ్రేక్ దర్శనానికి భారీగా అభ్యర్థనలు వస్తాయని అంచనా వేస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved