అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్పీలు దిగుతూ... జోరుగా లోకేష్ పాదయాత్ర
చిత్తూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. చిత్తూరు నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వృద్దులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల దగ్గరకి వెళ్లిమరీ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తమ అభిమాన నాయకుడు లోకేష్ తో యువతీయువకులు సెల్ఫీలు దిగుతున్నారు.

Lokesh Padayatra
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. తనను చూసేందుకు వచ్చిన వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న లోకేష్
Lokesh Padayatra
యువగళం పేరిట చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టిడిపి నేత నారా లోకేష్ తనకు ఎదురుపడ్డ స్కూల్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థుల చదువు ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు లోకేష్.
Lokesh Padayatra
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు నియోజకవర్గంలో ముగిసి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న లోకేష్
Lokesh Padayatra
యువగళం పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ తో మాట్లాడుతున్న పోలీసులు... నిబంధనల పేరిట ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపై లోకేష్ సీరియస్
Lokesh Padayatra
పాదయాత్రలో భాగంగా ఓ టేలర్ షాప్ లోకి వెెళ్ళి బట్టలుకుట్టే వ్యక్తితో ముచ్చటిస్తున్న నారా లోకేష్... టైలర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న లోకేష్
Lokesh Padayatra
చిత్తూరు జిల్లాలో యువగళం పేరిట పాదయాత్ర చేపడుతూ కిరాణాదుకాణం వద్దకు వెళ్లి మహిళతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
Lokesh Padayatra
పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ ను కలిసి సెల్పీ దిగుతున్న ముస్లీం యువతి... ముస్లిం టోపీ ధరించి స్వయంగా తానే ఫోటో తీస్తున్న లోకేష్