MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి, వైసీపీపై అనుమానాలు.. నిష్పక్షపాత విచారణ జరగాలి.. చంద్రబాబునాయుడు

ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి, వైసీపీపై అనుమానాలు.. నిష్పక్షపాత విచారణ జరగాలి.. చంద్రబాబునాయుడు

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 27 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తూర్పు గోదావరి : జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని గట్టిగా కోరుతున్నానన్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి చెందడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. శ్యామ్ అనే ఆ వీరాభిమాని ఉరివేసుకుని చనిపోయినట్లుగా ఫోటోలు వెలుగు చూశాయి. అయితే, అతని మృతిపై ఎన్టీఆర్ అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యాం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కొప్పిగుంట. అతను చనిపోయింది చింతలూరులో. ఉరి వేసుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనేమో అనిపిస్తుంది.

36

శ్యామ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా.. ఏదైనా కారణంతో అతడిని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానించేలా ఆ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా శ్యాం కుటుంబానికి మద్దతుగా నిలబడుతున్నారు. శ్యాం మృతి మీద దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

46

వెలుగులోకి వచ్చిన శ్యామ్ మృతి ఫోటోలో అతని కాళ్లు భూమిపైన ఆని ఉన్నాయి. శ్యామ్ నిజంగానే ఉరి వేసుకుని చనిపోతే అతని కాళ్లు భూమిమీద ఎందుకు ఉంటాయి. మెడ దగ్గర ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఎందుకు లేవు? ముఖం, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉన్నాయి? చేతి దగ్గర ఎవరో కోసినట్లుగా ఎందుకు కనిపిస్తోంది? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

56

‘వి వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ ట్వీట్ చేరేవరకు షేర్ చేయమంటూ కొంతమంది షేర్లు, ట్వీట్లు, రీ ట్వీట్లు కొడుతున్నారు. విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరితే అతను వారాహి యాత్రలో దీని మీద మాట్లాడతారని.. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని వారు అంటున్నారు. 

 

66

శ్యామ్.. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. విశ్వక్సేన్ నటించిన దాస్కా దమ్ కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చిన సమయంలో.. సెక్యూరిటీని దాటుకుని స్టేజి మీదికి వెళ్లాడు. ఆ సమయంలో సెక్యూరిటీ అతడిని పక్కకు తోసేయబోతుంటే ఎన్టీఆర్ వారిని వారించాడు. అతనితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోలు, వీడియోలు శ్యాం మృతి నేపథ్యంలో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Monsoon Rain Alert: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలకు ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
Pawan Kalyan: పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్| Asianet News Telugu
Recommended image3
Now Playing
అమరజీవి స్మృతి వనం వద్ద పవన్ సంచలన ప్రెస్ మీట్ | Deputy CM Pawan Kalyan Sensational comments
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved