కాణిపాకం, మంత్రాలయం, మహానంది కూడా వారి టార్గెట్... చిత్తూరు నంది విగ్రహ ధ్వంసంపై ఎస్పీ
గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా అంతర్రాష్ట్ర ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.
చిత్తూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు. ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.
గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.
గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.
ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు. గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.