ఊటూరు బ్యాంక్ దోపిడీ కేసు... 24గంటల్లోనే దొంగలు అరెస్ట్, వివరాలివే
గత మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు ఊటూరు ఎస్బిఐ బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబ్బులు దొంగిలించడానికి విశ్వప్రయత్నం చేసినా డబ్బులు మాత్రం దోచుకోలేకపోయారు.
గత మంగళవారం రాత్రి సమయంలో ఊటూరు ఎస్బిఐ బ్యాంకులో దుండగులు దొంగతనానికి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబ్బులు దొంగిలించడానికి విశ్వప్రయత్నం చేసినా డబ్బులు మాత్రం దోచుకోలేకపోయారు. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన సిపి కమలాసన్ రెడ్డి బ్యాంకును సందర్శించి అడిషనల్ ప్రత్యేకమైన టీమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం 24 గంటల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
కమాన్పూర్ మండలం పేరపల్లి కి చెందిన దూలం రాజు, రాగడిమద్దికుంట సుల్తానాబాద్ కు చెందిన అతని బావ బాలసాని అజయ్, కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన మాడిశెట్టి రాకేష్ మరియు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పి రెడ్డిపల్లికి చెందిన వెన్నుపూసల రాకేష్ రెడ్డి నలుగురు కలిసి హైదరాబాద్ లో ఓ రూమ్ కిరాయి తీసుకుని పని చేసుకుంటూ ఉంటున్నారు. వారి పని ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రాజు తన తండ్రి దూలం సంపత్ కు తెలుపగా అతను కూడా సరే అని ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో అజయ్, రాకేష్ రెడ్డి మరియు రాజులు టూ వీలర్ పై చల్లూరుకు పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా ఉటూరు ఎస్బిఐ వద్ద క్యాష్ డిపాజిట్ చేసే వాహనాన్ని గమనించారు. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది అని అనుకొని అజయ్ మరియు రాకేష్ రెడ్డిలు బ్యాంకు లోపల వెళ్లి పరిసరాలు, సీసీ కెమెరాల వివరాలు, అలారం సిస్టం యొక్క వివరాలు, ఏ విధంగా సులభంగా లోనికి వెళ్ళవచ్చు అని గమనించి తిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు చుట్టుపక్కల ఇల్లు దూరంగా ఉండడంతో దొంగతనం చేయడానికి ఎంచుకున్నారు.
అదే రోజు రాత్రి సుమారు 12.30 గంటల కు సంపత్ మరియు మాడిశెట్టి రాకేష్ ఇద్దరు ఒక బైక్, అజయ్, రాజు మరియు రాకేశ్ రెడ్డిలు మరొక పల్సర్ బండి పై ఊటూరు చేరుకున్నారు. రాకేష్ మరియు రాజులు బండి మీద బయట దూరంగా గమనిస్తూ ఉండగా సంపత్, అజయ్ మరియు రాకేష్ రెడ్డిలు ఒక ఖడ్గం ఒక ఇనపరాడ్ మరియు ఒక బ్యాగ్ తీసుకుని మెయిన్ గేటు ద్వారా బ్యాంకు పరిసరాల్లోకి ప్రవేశించి, చిన్న కలప దర్వాజా మరియు ఐరన్ గ్రిల్ యొక్క తాళములు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. వెంటనే బ్యాంకు లోపలి అలారం సిస్టం యొక్క వైర్లు కట్ చేశారు. బ్యాంకు లోపల కలియతిరిగి రికార్డు రూము, స్ట్రాంగ్ రూముల యొక్క తాళములు ఇనుపరాడ్లతో పగలగొట్టి, దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.
దొంగతనం ప్రయత్నం చేసిన తర్వాత ఈ ఐదుగురు దొంగలు రెండు బైకుల పై తిరిగి వేగురుపల్లి, సుల్తానాబాద్ ద్వారా పారి పోయినారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు టీం తీవ్రంగా శ్రమించి, సిసి ఫుటేజ్ లు గమనించి నిందితుల రూట్ గమనించి, పోలీస్ పెట్రోల్ కారు వారు నమోదు చేసిన అడ్రస్ వివరాలు ఆధారంగా ఈరోజు కమాన్పూర్ మండల పేరపెళ్లి వద్ద నిందితులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగం చేసిన ఒక ఖడ్గం, ఒక ఇనుప రాడ్, 2 టూ వీలర్స్ మరియు ఒక బ్యాగు ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల పూర్తి వివరాలు 1. దూలం సంపత్ s/o పోచయ్య, 45yrs, గౌడ, పేరపల్లి, కమాన్పూర్, పెద్దపల్లి. గౌడ వృత్తి. 2. దూలం రాజు s/o సంపత్, 19yrs, గౌడ, పేరపల్లి, కమాన్పూర్ పెద్దపల్లి. కారు డ్రైవర్. 3. బాలసాని అజయ్ s/o మల్లేష్, 19yrs, రాగడి మద్దికుంట,సుల్తానాబాద్ పెద్దపల్లి. విద్యార్థి. 4. మాడిశెట్టి రాకేష్ s/o బాపు, 20 yrs, మేర, రొంపి కుంట, కమాన్పూర్ , పెద్దపల్లి. బైక్ మెకానిక్. 5. వెన్నపూసల రాకేష్ రెడ్డి s/o నరేందర్రెడ్డి , 20yrs, రెడ్డి, r/o అప్పిరెడ్డిపల్లి, దేవరుప్పుల, జనగామ. ప్రైవేట్ జాబ్. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు 1. హోండా బైక్ 2.పల్సర్. 3. ఖడ్గం, ఐరన్ రాడ్, బ్యాగ్