MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సీఎం పర్యటనకు మీడియాకు నో ఎంట్రీ... వైఎస్ షర్మిల పర్యటనకు ఆహ్వానం...

సీఎం పర్యటనకు మీడియాకు నో ఎంట్రీ... వైఎస్ షర్మిల పర్యటనకు ఆహ్వానం...

వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు మీడియాకు నో ఎంట్రీ పెట్టగా.. వైఎస్ షర్మిల పర్యటనకు ఆహ్వానాలు పంపారు. వైఎస్ జగన్ ప్రజా సంబంధాల శాఖ పాసులు నిలిపివేశారు. 

1 Min read
Bukka Sumabala
Published : Jul 08 2023, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కడప : వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మీడియాకు అనుమతి లేదు. ప్రజా సంబంధాల శాఖ దీనికి పాసులజారీని కూడా నిలిపేసింది. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద కార్యక్రమాలకు సైతం అనుమతిలేదన్నారు. 

25

ఫొటోలు, వీడియోలు, పత్రికా ప్రకటనలు ఇస్తామని తెలిపారు. మీడియాను అనుమతించకపోవడానికి స్థలాభావం కూడా కారణం అని తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మీడియా మీద ఇలాంటి నిర్ణయానికి తీసుకోగా.. మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన కవరేజీకి మీడియా హజరు కావాలని మాత్రం మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

35

ఇడుపులపాయలో షర్మిల పర్యటన కవరేజికి అనుమతి ఉందంటూ మీడియాకు మెసేస్ లు వచ్చాయి. దీంతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్ చేసి మరీ మీడియా ప్రతినిధులకు తెలిపారు. దీనికోసం శుక్రవారమే హైదరాబాద్ నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలీ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విజయమ్మ ఇడుపులపాయకు వెళ్లారు.

45

వైఎస్ షర్మిల అక్కడినుంచి వేంపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాల భూమిని తన కొడుకు రాజారెడ్డి పేరుతో దాన విక్రయం రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి 2.12 ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె అంజలీరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. 

55

అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తల్లి విజయమ్మతో కలిసి రాత్రి బస చేశారు. శనివారం ఉదయం వైఎస్ ఘాట్ చేరుకుని నివాళులర్పించనున్నారు. తర్వాత హైదరాబాద్ కు వెళ్తారు. 

About the Author

BS
Bukka Sumabala
వై. ఎస్. షర్మిల

Latest Videos
Recommended Stories
Recommended image1
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Recommended image2
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Recommended image3
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved