MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • శెభాష్ గొట్టిపాటి రవికుమార్.. వరద బాధితుల కోసం కోటి ఖర్చు చేసిన ఏపీ విద్యుత్ శాఖ మినిస్టర్

శెభాష్ గొట్టిపాటి రవికుమార్.. వరద బాధితుల కోసం కోటి ఖర్చు చేసిన ఏపీ విద్యుత్ శాఖ మినిస్టర్

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితులకు బాసటగా నిలిచారు. గడిచిన నాలుగు రోజుల్లో ఆయన కోటి రూపాయల మేర వరద బాధితుల కోసం ఖర్చు చేసి ఉదార స్వభావం చాటుకున్నారు. విజయవాడతో పాటు బాపట్ల జిల్లాలో వరదల్లో ప్రభావితమైన ప్రజలకు ఉదారంగా సాయం అందించి శెభాష్ అనిపించుకుంటున్నారు. 

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Sep 06 2024, 01:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Minister Gottipati Ravikumar

Minister Gottipati Ravikumar

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సహాయం అందించారు. విజయవాడ, బాపట్ల, రేపల్లె తదితర ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల కోసం సుమారు కోటి రూపాయలకు పైగా ప్రత్యక్ష సాయాన్ని అందజేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వరద బాధితుల అండగా నిలబడేందుకు తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌. తొలి రోజు సుమారు 40 వేలకు పైగా ఆహార ప్యాకెట్లును విజయవాడలోని సింగ్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పంచారు. ప్రతీ ఒక్క ఆహార ప్యాకెట్ తో పాటు వాటర్ బాటిల్ కూడా అందజేశారు. అదే రోజు మరో 25 వేల వాటర్ బాటిళ్లను బాధితుల కోసం పంపించారు. 

35

ఇక, రెండో రోజూ 60 వేల ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్, సింగ్ నగర్ ప్రాంతాలతో పాటు సొంత జిల్లా బాపట్లలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.  

మూడో రోజు వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్ధుల కోసం 15 వేల పాల ప్యాకెట్లు, 30 వేల వాటర్ బాటిళ్లను విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేటకు పంపించారు. అంతేగాకుండా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలకు కూడా పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిళ్లను అందించారు. 
నాలుగో రోజు గొల్లపూడి, సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ లోని వరద బాధితులకు పాల ప్యాకెట్లతో పాటు, మంచి నీటి బాటిళ్లను అందించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజులుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితుల కోసం కోటి రూపాయిల మేర తక్షణ సాయాన్ని అందించి వరద బాధితులకు బాసటగా నిలిచారు.

45

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. విజయవాడ, బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు తాను చేయదగిన సాయం అందించినట్లు తెలిపారు. ఒకవైపు బాపట్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే తన అనుచరులతో సాయంతో బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు, పాలు అందించగలిగినట్లు చెప్పారు. వరద బాధితులకు సాయం చేసేందుకు దాతలు కంపెనీలు ముందుకు రావాలని కోరారు.

55

లైన్మెన్ కుటుంబానికి సాయం..

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొని వస్తూ వరదలో కొట్టుకుపోయిన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అందజేశారు. ఎక్స్ గ్రేషియా రూ.25 లక్షలతో పాటు విద్యుత్ శాఖ నుంచి కోటేశ్వరరావుకు చెందాల్సిన మరో రూ.13 లక్షలను ఆయన భార్య మాధవికి అందించారు. దాంతో పాటు విద్యుత్ శాఖలో మాధవికి ఉద్యోగమిస్తూ నియామక పత్రాన్ని కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్వయంగా ఇబ్రహీంపట్నంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ... కోటేశ్వరరావు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు ఏటా విద్యుత్ శాఖ నుంచి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వృత్తి పట్ల నిబద్ధత కలిగిన లైన్‌మెన్ కోటేశ్వరరావుని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి నిబద్ధత గల ఉద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Kotamreddy Daughter Rapid Fire Interview With Her Father | Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Recommended image2
Now Playing
YSR ఘాట్ వద్ద ఎదురుపడ్డ జగన్ - షర్మిల | Asianet News Telugu
Recommended image3
Now Playing
జగన్ VS చంద్రబాబు ల హెలికాఫ్టర్ల మధ్య తేడా | YS Jagan Helicopter | Chandrbabu Helicopter
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved