MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Nara Lokesh: ఏపీ లోని విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉండండి..ముహుర్తం ఈ నెల 10 నే!

Nara Lokesh: ఏపీ లోని విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉండండి..ముహుర్తం ఈ నెల 10 నే!

జులై 10న ఏపీ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పీటీఎం 2.0. విద్యార్థుల ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించనున్నారు.

2 Min read
Bhavana Thota
Published : Jul 05 2025, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెగా పీటీఎం 2.0
Image Credit : Getty

మెగా పీటీఎం 2.0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో జూలై 10న ప్రత్యేక కార్యక్రమంగా 'మెగా పీటీఎం 2.0' నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య నేరుగా మట్లాడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి.

26
ప్రోగ్రెస్ కార్డులు
Image Credit : GOOGLE

ప్రోగ్రెస్ కార్డులు

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాఠశాలల్లో విద్యా నాణ్యత, పథకాల అమలు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, క్లాస్‌లు ఎలా నిర్వహించాల్సినదీ వంటి అంశాలపై చర్చించారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందించనున్నారు. వీటిలో విద్యార్థుల హాజరు శాతం, సామర్థ్యాలు, పాఠ్య ప్రగతిపై స్పష్టమైన సమాచారం ఇవ్వనున్నారు. పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సమావేశాలు మేలు చేస్తాయని భావిస్తున్నారు.

Related Articles

Related image1
Nara lokesh: కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు..నిందితులను కఠినంగా శిక్షిస్తాం..!
Related image2
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్‌!
36
ఆటిజం సమస్య
Image Credit : Asianet News

ఆటిజం సమస్య

పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొక్కలు నాటే, పరిరక్షించే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపుగా 'గ్రీన్ పాస్‌పోర్ట్'లు ఇవ్వాలని సూచనలొచ్చాయి.ఆటిజం సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో భవిత సెంటర్లను పునరుద్ధరించేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

46
కొత్త విశ్వవిద్యాలయాలు
Image Credit : Asianet News

కొత్త విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో ఉన్న ఖాళీ టీచర్ పోస్టులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నెలలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూల్ ప్లస్ శ్రేణుల్లో అధ్యాపకుల నియామకాలు పూర్తి చేసి, షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు.

రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న సంస్థలతో చర్చలు జరిపి, వాటిని వేగంగా అమలులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని దూర ప్రాంత పాఠశాలలకు మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే గిరిజన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే మార్గాలపై అధ్యయనం చేసి, అవసరమైతే కొత్త భవనాలు నిర్మించాలని చెప్పారు.

56
నైపుణ్యాభివృద్ధి
Image Credit : ANI

నైపుణ్యాభివృద్ధి

అంతేకాదు, ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికపై యూజీసీ నిబంధనల ఆధారంగా సరికొత్త విధానాలను చేపట్టాలని, విద్యార్థులపై భారం పడకుండా సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

నైపుణ్యాభివృద్ధిపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో ప్రారంభించనున్న 'నైపుణ్యం పోర్టల్' గురించి సమీక్షించి, సెప్టెంబరులోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారని వెల్లడించారు. ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేసిన వారందరికీ ఆటోమేటిక్‌గా రెజ్యూమే తయారయ్యే విధంగా సాంకేతిక పద్ధతులు రూపొందించాలని ఆదేశించారు.

66
రూ.600 కోట్లు మంజూరు
Image Credit : ANI

రూ.600 కోట్లు మంజూరు

ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.600 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఈ నిధులను వినియోగించాలని తెలిపారు.

ఈ మొత్తం కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని విద్యా రంగం బలోపేతం కానుందని, విద్యార్థుల భవిష్యత్తు దిశగా ప్రభుత్వం స్పష్టమైన దృష్టితో ముందుకెళ్తున్నదని అర్థమవుతోంది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాలలు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నదే ఈ కార్యక్రమాల ఉద్దేశంగా తెలుస్తోంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved