ఏపీలో పెరిగిన పులుల సంఖ్య... గ్లోబల్ టైగర్స్ డే కార్యక్రమంలో సీఎం జగన్
గ్లోబల్ టైగర్ డే2021 సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణకు అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
అమరావతి: పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు.
అమరావతి: పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు.
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని సీఎంకు తెలిపారు.
నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులులు ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు అధికారులు.
నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులులు ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు అధికారులు.
ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.