MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సమోసాలు తిని నలుగురు చిన్నారులు మృతి... చంద్రబాబు సర్కార్ సీరియస్ యాక్షన్

సమోసాలు తిని నలుగురు చిన్నారులు మృతి... చంద్రబాబు సర్కార్ సీరియస్ యాక్షన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి అనాధాశ్రమం విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నారా లోకేష్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ఆయన సీరియస్ ఆదేశాలిచ్చారు. 

1 Min read
Arun Kumar P
Published : Aug 19 2024, 11:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anakapalle Incident

Anakapalle Incident

Anakapalle Incident : కలుషిత ఆహారంతిని విద్యార్థులు మృతిచెందిన ఘటనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా వుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ అనాధాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతిచెందారు...   ఇంకా చాలామంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.  

25
Anakapalle Incident

Anakapalle Incident

ఈ ఘటన గురించి తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అధికారులను అడిగి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యాశాఖమంత్రి నారా లోకేష్ కు కూడా ఫోన్ చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అధించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

35
Anakapalle Incident

Anakapalle Incident

కైలాసపట్నం అనాధాశ్రమం ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది చంద్రబాబు సర్కార్. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థుల సంరక్షకులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

45
Food poisoning

Food poisoning

అసలేం జరిగింది :  

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో అనాధ పిల్లల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇందులో దాదాపు 80 మంది విద్యార్థులు వుంటున్నారు. గత శనివారం సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా సమోసాలు ఇచ్చారు. ఆ సమోసాలు తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హాస్టల్ నిర్వహకులు విద్యార్థులను సమీపంలోని నర్సీపట్నం, అనకాపల్లి హాస్పటల్స్  కు తరలించారు. 

 

55
Food poisoning

Food poisoning

ఇలా హాస్పిటల్ పాలయిన 27మంది విద్యార్థుల్లో కొందరి పరిస్థితి మెరుగుపడగా... ఇంకా కొందరి పరిస్థితి పూర్తిగా విషమించింది. ఇలా ఆరోగ్యం విషమించి జాషువా, భవాని, శ్రద్ద, నిత్య  ప్రాణాలు కోల్పోయారు. మిగతా విద్యార్థులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇంకెవరికీ ప్రాణాపాయం జరక్కుండా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.రెండు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved