MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వివాహేతర సంబంధం : భార్యను చున్నీతో ఉరిబిగించి.. హత్య చేసిన భర్త...

వివాహేతర సంబంధం : భార్యను చున్నీతో ఉరిబిగించి.. హత్య చేసిన భర్త...

వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను చున్నీ గొంతుకు బిగించి హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన అనకాపల్లిలో వెలుగు చూసింది. 

1 Min read
Bukka Sumabala
Published : Jul 26 2023, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.  భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త ఆమెను హత్య చేశాడు. భార్య మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

28

మంగళవారం నాడు అనకాపల్లి మండలంలోని తోటాడలో ఈ  ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… కొత్తలంక నూకప్పారావు గ్రామంలోని దళితవాడకు చెందిన వ్యక్తి. స్థానికంగా సీలింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

38

గోలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ(26)తో పదేళ్ల క్రితం నూకప్పారావుకు వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. 

48

ఈ క్రమంలోనే నూకప్పారావుకు, దీనమ్మకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీనమ్మ.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం నూకప్పారావుకు తెలిసింది. అది జీర్ణించుకోలేకపోయాడు. తరచుగా ఇదే విషయంతో భార్యతో గొడవపడేవాడు.

58

భార్య భర్తలిద్దరు.. కొద్దికాలం విడిగా కూడా ఉన్నారు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో నూకప్పారావు అసహనానికి గురైయ్యాడు. ఈనెల 23వ తేదీన పెద్దల దగ్గర పంచాయతీ కూడా జరిగింది.

68

ఆ తర్వాతి రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది. దీంతో కోపం పట్టలేకపోయిన భర్త.. భార్య మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు.  

78

దీంతో  తప్పించుకోవడానికి పెనుగులాడిన  దీనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నూకప్పారావు ఆ తరువాత నేరుగా అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లి… పోలీసుల ముందు లొంగిపోయాడు. 

88

ఈ ఘటనకు సంబంధించి విఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు చేశాడని ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎలమంచిలి రూరల్ సీఐ గఫూర్ తెలిపారు. ఘటన జరిగిన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. మృతదేహాన్ని అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
Recommended image2
Now Playing
Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu
Recommended image3
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved