MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • నెలకి రూ.లక్షపైనే జీతం: ఈ జాబ్ మీకు సెట్ అవుతుందేమో చెక్ చేసుకోండి

నెలకి రూ.లక్షపైనే జీతం: ఈ జాబ్ మీకు సెట్ అవుతుందేమో చెక్ చేసుకోండి

మీకు సేవ చేయాలన్న కోరిక ఉందా? అయితే నెలకు రూ.లక్ష జీతం ఇచ్చే ఉద్యోగాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించేది ప్రభుత్వమే. ఉద్యోగం ఏమిటి? ఎక్కడ పనిచేయాలి? ట్రైనింగ్ ఎన్నాళ్లు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 15 2024, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మీకు సేవ చేయాలన్న కోరిక ఉందా? అయితే నెలకు రూ.లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించేది ప్రభుత్వమే. ఉద్యోగం ఏమిటి? ఎక్కడ పనిచేయాలి? ట్రైనింగ్ ఎన్నాళ్లు? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీని కోసం అభ్యర్థులు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ-నర్సింగ్ చదివిన వారు అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి రాష్ర్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో జపనీస్ భాషను కూడా నేర్పిస్తారు. ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో ఈ భాషను నేర్పించి వారికి జపాన్ దేశంలో హాస్పిటల్లో కేర్ టేకర్స్ గా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
 

35

శిక్షణ ఇలా..
జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, 32 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని,  నావిస్ హెచ్ఆర్, బెంగళూరు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు  తెలిపారు. 
ఫీజులో ప్రభుత్వం సాయం రూ.25 వేలు.. 
శిక్షణ రుసుముగా ఫీజు రూ.3,50,000 గా చెల్లించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. మొదటి రుసుముగా రూ.50,000 చెల్లించాలన్నారు. అందులో రూ.25 వేలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లిస్తుందని, మిగిలిన రూ.25 వేలు అభ్యర్థి చెల్లించాలని తెలియజేశారు. 
 

45

మిగిలిన రూ.3 లక్షలను మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుంది.  శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశంలో ఉద్యోగావకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను కూడా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందన్నారు.  

ఉద్యోగం పొందిన అభ్యర్థికి  జీతం నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
 

55

 ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింక్ https://shorturl.at/FB7ok నందు వివరాలని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెప్టెంబరు 18వ తేదీలోగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 లోపు ఫోన్ నెంబరు 7386706272 కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
Recommended image2
Now Playing
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu
Recommended image3
Now Playing
శాంతి.. అంతులేని అవినీతి | ACB Raid Exposes Crores Worth Assets of Endowments Dept Officer K Shanthi
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved