వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం... ప్రారంభించిన సీఎం జగన్
రబీ పంటకుగాను అర్హులైన రైతులందరికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వారి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది.
గుంటూరు: రబీ పంటకుగాను అర్హులైన రైతులందరికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వారి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా అధికారులు, నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా వ్యవసాయధికారి, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ... వైఎస్సార్ వడ్డీ లేని రుణాల పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేసారన్నారు. దాదాపు 6 లక్షల 28 వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
రబీ సీజన్ లో లక్ష లోపు పంటరుణాలు తీసుకొని ఏడాది లోపు చెల్లించిన రైతులకు ఈ పథకం కింద నగదు జమ అవుతుందన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద దాదాపు 128 కోట్ల రూపాయలు జమ కానున్నాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని సీఎం చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారన్నారు.