జగన్ ఏలూరు పర్యటన : నూతన దంపతులకు ఆశీర్వదించిన సీఎం...
కరోనా వైరస్ కారణంగా చాలాకాలంగా జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు.
కరోనా వైరస్ కారణంగా చాలాకాలంగా జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు.
పర్యటనలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్ నుర్జహాన్ కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవరపేటలోని శ్రీ సూర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన షేక్ ముజుబుర్ రెహమాన్, నూర్జహాన్ల కుమార్తె వివాహానికి హాజరైన సీఎం వైయస్.జగన్ వధూవరులను ఆశీర్వదించారు.
తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు.
ముఖ్యంగా దశాబ్దాల తరబడి ఏలూరు నగర ప్రజలకు సమస్యగా మారిన తమ్మిలేరు వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు నిర్మించతలపెట్టిన రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేయనున్నారు. ఏలూరు నగర శివార్లలోని తంగెళ్లమూడి వద్ద ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పర్యటన నేపధ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్యమంత్రి పర్యటనపై అధికార్లతో సమీక్ష నిర్వహించారు.
మంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఇతర ప్రజాప్రతినిధులు జగన్ తో పాటు హాజరు.