పట్టుకోసం చంద్రబాబు పావులు: మళ్లీ ఆ వర్గానికి పెద్దపీట
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు కసరత్తును ప్రారంభించారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్దం చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు.
పోగోట్టుకొన్న చోటే వెతుక్కోవాలనేది నానుడి. ఈ వర్గంలో పట్టుకోల్పోయామని భావిస్తోందో... ఆ వర్గంలో పట్టుకు టీడీపీ తిరిగి ప్రయత్నాలను ప్రారంభించింది.
2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైంది. అధికారానికి దూరమైన తర్వాత పార్టీ నాయకత్వం కాయకల్ప చికిత్సను ప్రారంభించింది. పార్టీకి వెన్నెముకలాంటి బీసీ సామాజికవర్గం పార్టీకి దూరమైనట్టుగా ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
దీంతో బీసీలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేయాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన 50 మందికి కీలక పదవులు కేటాయించింది.
పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చంద్రబాబునాయుడు కసరత్తును ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అచ్చెన్నాయుడుకు కట్టబెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీద రవిచంద్రను టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెడుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే అచ్చెన్నాయుడి వైపే బాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బీద రవిచంద్రయాదవ్ కు కట్టబెడతారని ప్రచారం సాగుతోంది. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను రవిచంద్రకు అప్పజెప్పనున్నారనే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగించనున్నారు. రాష్ట్ర కమిటీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు. సీనియర్ల స్థానంలో యువతకు కీలక పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం.
పార్టీ క్యాడర్ ను కలుపుకుపోవడంలో నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వైఫల్యం చెందిన కారణంగానే పార్టీ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయం కూడ పార్టీ వర్గాల్లో నెలకొంది.
2024లో జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్ర కార్యవర్గాన్ని చంద్రబాబునాయుడు సిద్దం చేయనున్నారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు కీలక పదవులను కట్టబెట్టే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు ఆ పార్టీ నాయకత్వం పెద్దపీట వేసింది. అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు హామీ ఇచ్చినట్టుగా జగన్ ఎమ్మెల్సీ పదవిని జంగా కృష్ణమూర్తికి ఇచ్చాడు. బీసీ సామాజికవర్గం కూడ పార్టీ దూరం కావడం ఓటమికి కారణమనే అభిప్రాయాలు టీడీపీ నాయకత్వంలో ఉంది. దీంతో బీసీలకు పెద్దపీట వేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నాడు.