రంగంలోకి బాబు: కేశినేనికి ఫోన్, బెజవాడ టీడీపీ నేతల మధ్య గొడవపై సీరియస్
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య చోటు చేసుకొన్న విబేధాలపై టీడీపీ అధిష్టానం కేంద్రీకరించింది. ఈ విషయమై చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాడు.

<p>: విజయవాడకు చెందిన టీడీపీ నేతల మధ్య చోటు చేసుకొన్న విబేధాలపై టీడీపీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఈ విషయాన్ని పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు చెప్పారు.వ్యక్తిగతంగా పరస్పరం విమర్శలు చేసుకోవద్దని ఆయన సూచించారు.</p><p> </p>
: విజయవాడకు చెందిన టీడీపీ నేతల మధ్య చోటు చేసుకొన్న విబేధాలపై టీడీపీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఈ విషయాన్ని పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు చెప్పారు.వ్యక్తిగతంగా పరస్పరం విమర్శలు చేసుకోవద్దని ఆయన సూచించారు.
<p><br />విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 39వ డివిజన్ పరిధి నుండి టీడీపీ అభ్యర్ధిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తున్నారు. అదే డివిజన్ నుండి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కూతురు పూజితను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాలు బలపరుస్తున్నారు.</p>
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 39వ డివిజన్ పరిధి నుండి టీడీపీ అభ్యర్ధిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తున్నారు. అదే డివిజన్ నుండి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కూతురు పూజితను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాలు బలపరుస్తున్నారు.
<p><br />ఒకే పార్టీ నుండి ఇదే డివిజన్ లో రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకొన్నారు. ఈ విషయమై బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలపై కేశినేని నాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు</p>
ఒకే పార్టీ నుండి ఇదే డివిజన్ లో రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకొన్నారు. ఈ విషయమై బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలపై కేశినేని నాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు
<p>నాగుల్ మీరా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం కూడ సోషల్ మీడియాలో సాగింది.ఈ ప్రచారాన్ని నాగుల్ మీరా తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాలను టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.</p>
నాగుల్ మీరా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం కూడ సోషల్ మీడియాలో సాగింది.ఈ ప్రచారాన్ని నాగుల్ మీరా తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాలను టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.
<p>మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గోగుల రమణరావును టీడీపీ అభ్యర్థిగా నాని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వర్గం కూడా గుర్రుగా ఉంది. </p>
మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గోగుల రమణరావును టీడీపీ అభ్యర్థిగా నాని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వర్గం కూడా గుర్రుగా ఉంది.
<p>ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని, ఆయనకు వ్యతిరేకంగా ఏకమైన వర్గం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. ఓటమి పాలైన ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని కేశినేని నాని పార్టీలోని తన వ్యతిరేక వర్గీయులపై విమర్శలు గుప్పించారు. </p>
ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని, ఆయనకు వ్యతిరేకంగా ఏకమైన వర్గం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. ఓటమి పాలైన ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని కేశినేని నాని పార్టీలోని తన వ్యతిరేక వర్గీయులపై విమర్శలు గుప్పించారు.
<p>విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని నేతల మధ్య విబేధాలను పరిష్కరించాలని అచ్చెన్నాయుడును ఆదేశించారు చంద్రబాబునాయుడు. దీంతో అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం శ్రీకాకుళం నుంచి విజయవాడ చేరుకుని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో భేటీ అయ్యారు.</p><p> </p>
విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని నేతల మధ్య విబేధాలను పరిష్కరించాలని అచ్చెన్నాయుడును ఆదేశించారు చంద్రబాబునాయుడు. దీంతో అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం శ్రీకాకుళం నుంచి విజయవాడ చేరుకుని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో భేటీ అయ్యారు.
<p>అచ్చెన్నాయుడి నివాసంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో విభేదాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ అభ్యర్థుల ఎంపికపై తమను సంప్రదించకుండా ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలు పోతున్నారని పార్టీ గెలుపు కోసం పాటుపడుతున్న తమను సామంతరాజులంటూ విమర్శిస్తున్నారని వెంకన్న, నాగుల్మీరా తమ వాదనలు వినిపించినట్టు తెలిసింది. </p>
అచ్చెన్నాయుడి నివాసంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో విభేదాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ అభ్యర్థుల ఎంపికపై తమను సంప్రదించకుండా ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలు పోతున్నారని పార్టీ గెలుపు కోసం పాటుపడుతున్న తమను సామంతరాజులంటూ విమర్శిస్తున్నారని వెంకన్న, నాగుల్మీరా తమ వాదనలు వినిపించినట్టు తెలిసింది.
<p>ప్రధానంగా 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎంపికపై వారు గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవడం, లేదా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప ఇలా బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని అచ్చెన్నాయుడు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు చెప్పారు</p>
ప్రధానంగా 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎంపికపై వారు గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవడం, లేదా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప ఇలా బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని అచ్చెన్నాయుడు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు చెప్పారు
<p>రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడతామని, అంతవరకు బహిరంగ వేదికలపై గాని, మీడియా ముందుగాని ఈ విషయాలను మాట్లాడవద్దని అచ్చెన్నాయుడు సూచించారు.</p><p> </p>
రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడతామని, అంతవరకు బహిరంగ వేదికలపై గాని, మీడియా ముందుగాని ఈ విషయాలను మాట్లాడవద్దని అచ్చెన్నాయుడు సూచించారు.
<p>సమావేశం అనంతరం బుద్దా వెంకన్న, నాగుల్మీరా మీడియాతో మాట్లాడారు. పార్టీ పెద్దల మాటకు గౌరవం ఇస్తూ తమ కార్యాచరణను వాయిదా వేసుకున్నామని తెలిపారు. </p>
సమావేశం అనంతరం బుద్దా వెంకన్న, నాగుల్మీరా మీడియాతో మాట్లాడారు. పార్టీ పెద్దల మాటకు గౌరవం ఇస్తూ తమ కార్యాచరణను వాయిదా వేసుకున్నామని తెలిపారు.
<p>బెజవాడ టీడీపీ పంచాయితీ వెనుక పెద్ద గూడుపుఠాణీ నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.</p>
బెజవాడ టీడీపీ పంచాయితీ వెనుక పెద్ద గూడుపుఠాణీ నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
<p> సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించనున్నారు. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఈ రెండు నగరాల్లోని పార్టీ నాయకుల మధ్య విభేదాలపై సీరియస్గా ఉన్నారు. సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీకి నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది.</p>
సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించనున్నారు. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఈ రెండు నగరాల్లోని పార్టీ నాయకుల మధ్య విభేదాలపై సీరియస్గా ఉన్నారు. సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీకి నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది.
<p>ఇదే విషయమై ఆయన ఆదివారం విజయవాడ ఎంపీ కేశినేని నానీతో ఫోన్లో మాట్లాడినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అంతవరకు వేచి చూడాలని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సూచించినట్లు తెలిసింది.</p>
ఇదే విషయమై ఆయన ఆదివారం విజయవాడ ఎంపీ కేశినేని నానీతో ఫోన్లో మాట్లాడినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అంతవరకు వేచి చూడాలని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సూచించినట్లు తెలిసింది.