MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • MGNREGA: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం... 21.50 కోట్ల పనిదినాలు పెంపు

MGNREGA: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం... 21.50 కోట్ల పనిదినాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21.50 కోట్ల పనిదినాలు పెంచినట్లు ప్రకటించింది.

1 Min read
Author : Galam Venkata Rao
| Updated : Jul 31 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉపాధి హామీ

ఉపాధి హామీ

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది పేద కుటుంబాలకు ఉపాధి లభించనుంది.

24
21.50 కోట్ల ఉపాధి హామీ పనిదినాలు పెంపు

21.50 కోట్ల ఉపాధి హామీ పనిదినాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి  గానూ లేబర్ బడ్జెట్‌ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు. 

34
అదనపు పని దినాల మంజూరు

అదనపు పని దినాల మంజూరు

లేబర్ బడ్జెట్  మొదటి విడతగా 15 కోట్ల పని దినాలు మంజూరు చేసింది. ఆ పని దినాలు జూన్ నెలాఖరుకే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అదనపు పని దినాల కోసం ఈ ప్రతిపాదనలు పంపామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని తెలియజేశారు. 

44
సత్వరమే బకాయిల విడుదల

సత్వరమే బకాయిల విడుదల

అదే విధంగా ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
Recommended image2
Now Playing
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Now Playing
Pawan Kalyan Powerful Speech: ఇది దేశానికే గేమ్ చేంజర్ పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved