MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే ఛాన్స్‌.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే ఛాన్స్‌.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు

డీజీ లక్ష్మి పథకంతో ఏపీ పట్టణాల్లో 9,034 సర్వీసు కేంద్రాలు, మహిళలకు ఉపాధి, ప్రజలకు 250 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 01 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీజీ లక్ష్మి పథకాన్ని
Image Credit : Google

డీజీ లక్ష్మి పథకాన్ని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు సేవల్ని మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో కొత్తగా డీజీ లక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలు ప్రజలకు 250 రకాల సేవల్ని ఒకేచోట అందించనున్నాయి.ఈ కేంద్రాల ప్రత్యేకత ఏమిటంటే, వీటిని డ్వాక్రా మహిళలు నిర్వహించనుండటం. అంటే ఒకవైపు మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, మరోవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా లభిస్తాయి. 

25
స్వయం సహాయక సంఘాల మహిళల్ని
Image Credit : Google

స్వయం సహాయక సంఘాల మహిళల్ని

దీనికోసం మెప్మా (మిషన్ ఫర్ ఎలివియేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) ద్వారా అర్హులైన స్వయం సహాయక సంఘాల మహిళల్ని ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.మీ-సేవా మాదిరిగానే ఈ డీజీ లక్ష్మి కేంద్రాల్లో పౌరులు ప్రభుత్వం అందించే పలు సేవలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వాటిలో పథకాల అప్లికేషన్లు, సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు, వాలిడేషన్‌లు, ఇతర పౌర సేవలు ఉంటాయి.ఈ కేంద్రాలను నిర్వహించాలనుకునే మహిళలకు కొన్ని అర్హతలు తప్పనిసరి. కనీసం మూడు సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం ఉండాలి. వయస్సు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. తాము పెళ్లి అయినవారై ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలి. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివసిస్తూ, స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు అయి ఉండాలి.

Related Articles

Related image1
Andhra Pradesh లో వారికి జీతాల పెంపు..ఏకంగా ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.7 వేలు!
Related image2
Andhra Pradesh: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ..వాట్సాప్ ఉంటే చాలు!
35
రూ.2.50 లక్షల రుణాన్ని
Image Credit : our own

రూ.2.50 లక్షల రుణాన్ని

ఎంపికైన మహిళలకు కేంద్ర ఏర్పాటుకు అవసరమైన సదుపాయాల కోసం రూ.2.50 లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. దీన్ని కియోస్క్ ఏర్పాటు, కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు.ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిగతుల మెరుగుదల దృష్ట్యా ఇది బలమైన ప్రయత్నంగా పరిగణించవచ్చు.

45
నైపుణ్యాభివృద్ధి రంగం
Image Credit : our own

నైపుణ్యాభివృద్ధి రంగం

ఇక నైపుణ్యాభివృద్ధి రంగంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేసే ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ఉద్యోగులతో పాటు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.23.84 కోట్లు వెచ్చించనుంది. ఈ శిక్షణ స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఈ శిక్షణ కార్యక్రమం అమలు చేయనున్నారు.నైపుణ్యాభివృద్ధి శిక్షణను అమలు చేయడానికి AILSG, సాహాస్, వాష్ సంస్థలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని స్వచ్ఛాంధ్ర సంస్థకు ఇందుకోసం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

55
గోదావరి నది కాలుష్యాన్ని
Image Credit : our own

గోదావరి నది కాలుష్యాన్ని

కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అక్కడి 51 చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ.14.41 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు 'స్వర్ణకుప్పం-2029' మార్గదర్శక పథకంలో భాగంగా జరుగుతోంది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.ఇక రాజమహేంద్రవరం సమీపంలో గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.25 కోట్లు విడుదల చేసింది. జాతీయ నదుల సంరక్షణ కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. గోదావరి నదిని శుద్ధి చేయడానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Andhra Pradesh లో వారికి జీతాల పెంపు..ఏకంగా ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.7 వేలు!
Recommended image2
Andhra Pradesh: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ..వాట్సాప్ ఉంటే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved