MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మార్కెట్‌తో పోలిస్తే చాలా చీప్.. మరోసారి తగ్గిన నిత్యవసర ధరలు.. బియ్యం, కందిపప్పు ఎంతంటే?

మార్కెట్‌తో పోలిస్తే చాలా చీప్.. మరోసారి తగ్గిన నిత్యవసర ధరలు.. బియ్యం, కందిపప్పు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యవసర సరకుల ధరలను మరోసారి తగ్గించింది. 

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Aug 02 2024, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరకులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో అందనంత ఎక్కువలో ఉన్న నిత్యవసర సరకుల ధరలను నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

28

బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా.. రూ.150కి తగ్గించారు. బియ్యం రూ.48 ఉండగా రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గించారు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే విక్రయాలు ప్రారంభించారు.

38
Nadendla Manohar

Nadendla Manohar

అన్ని జిల్లాల్లో ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గడిచిన నెల రోజులలోపే బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

48

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ- జనసేన- కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూలై నెలలో మొదటిసారి నిత్యవసర సరకుల ధరలను తగ్గించింది. నిత్యవసరాల్లో కీలకమైన బియ్యం, కందిపప్పును సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

58

గతంలో 181 రూపాయలు ఉన్న కిలో కందిపప్పు ధరను 160 రూపాయలకు తగ్గించారు. 52 రూపాయలు ఉన్న కిలో బియ్యం ధరను 48 రూపాయలకు తగ్గించారు. స్టీమ్డ్‌ బియ్యం రేటును 56 రూపాయల నుంచి 49 రూపాయలకు తగ్గించారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందించేలా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 

68

ప్రస్తుతం ఈ కందిపప్పు ధర 160 రూపాయల నుంచి రూ.150కి తగ్గించారు. బియ్యం రూ.48 నుంచి రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

78

పేద ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరకులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన నిత్యవసరాల ధరల నుంచి పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించింది.

88

కాగా, నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు నిత్యవసర సరకుల ధరలను తగ్గించడంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సరకులు మార్కెట్‌ రేటు కంటే తక్కువకే లభిస్తుండటంతో ఆనంద పడుతున్నారు. నెలవారీ ఇంటి ఖర్చులు కూడా తగ్గాయని చెబుతున్నారు. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘ‌ట‌న‌
Recommended image2
IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?
Recommended image3
Now Playing
YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved