Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • Salaries Hikes : ఏపీలో వీరికి జీతాలు పెంపు.. ఇదిగో జీవో

Salaries Hikes : ఏపీలో వీరికి జీతాలు పెంపు.. ఇదిగో జీవో

Salaries Hikes: ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ లెక్చరర్ల జీతాన్ని గంటకు రూ.375కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వీరు నెలకు గరిష్టంగా రూ.27,000 అందుకోనున్నారు.   

Mahesh Rajamoni | Published : May 12 2025, 07:39 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

AP government hikes salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచూతు నిర్ణయం తీసుకున్నారు. 

25
Asianet Image

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ల జీతాలను పెంచుతూ సోమవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వుల ప్రకారం.. గెస్ట్ లెక్చరర్లకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న గంటకు రూ.150 పారితోషికాన్ని రూ.375కి పెంచారు. దీనివల్ల ఒక నెలకు గరిష్టంగా రూ.27,000 వేతనం అందనుంది.

Related Articles

PM Modi Speech LIVE: ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగం లైవ్ అప్డేట్స్
PM Modi Speech LIVE: ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగం లైవ్ అప్డేట్స్
india Pakistan: పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడి జరిగిందా? భారత సైన్యం ఏం చెప్పిందంటే?
india Pakistan: పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడి జరిగిందా? భారత సైన్యం ఏం చెప్పిందంటే?
35
Asianet Image

గెస్ట్ లెక్చరర్ల జీతాల పెంపు జీవో విడుదల తర్వాత ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధిపొందనున్నారు. 

 

45
Asianet Image

ఇప్పటి వరకూ గెస్ట్ లెక్చరర్లకు నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే చెల్లించేవారు. దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయంతో గెస్ట్ లెక్చరర్లకు లాభం కలగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లు తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ గెస్ట్ లెక్చరర్ల జీతాల పెంపు జీవో ఇక్కడ చూడండి

55
Asianet Image

కాగా, ఏపీలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఏపీసెట్, యూజీసీ నెట్, లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు, డెమో లెక్చర్ ఆధారంగా జరుగుతుంది. సంబంధిత కాలేజీలు ప్రిన్సిపాల్‌లు లేదా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా  గెస్ట్ లెక్చరర్లకు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తుంటారు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
ఉద్యోగాలు, కెరీర్
 
Recommended Stories
Top Stories