MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Cabinet: ఉచితంగా కార్పొరేట్ విద్య‌.. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంట‌ర్ల ఏర్పాటు

AP Cabinet: ఉచితంగా కార్పొరేట్ విద్య‌.. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంట‌ర్ల ఏర్పాటు

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, విద్య, పర్యాటకం, తాగునీటి సదుపాయాలు, రాజధాని అభివృద్ధి వంటి కీలక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం జ‌రిగింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 10 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేద విద్యార్థులకు ఉచిత IIT, JEE, NEET రెసిడెన్షియల్ కోచింగ్
Image Credit : Gemini AI

పేద విద్యార్థులకు ఉచిత IIT, JEE, NEET రెసిడెన్షియల్ కోచింగ్

సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు IIT-JEE, NEET ప్రవేశ పరీక్షలకు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు. ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, వసతి, భోజన సౌకర్యాలతో గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. 31 వేలకుపైగా ఉద్యోగాలు
Image Credit : Asianet News

రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. 31 వేలకుపైగా ఉద్యోగాలు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో మొత్తం 13 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.11,569.91 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, దాదాపు 31,431 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

చిత్తూరు జిల్లాలో మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ రూ.1,801 కోట్లతో భారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, విద్యుత్ సబ్సిడీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. అదేవిధంగా వ్యర్థ నూనెతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ ప్రాజెక్టుకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసింది.

Related Articles

Related image1
అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు
Related image2
Beer: ఫుల్లుగా బీర్లు తాగుతున్నారు.. అయినా కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. అసలేం జరుగుతోంది?
35
పర్యాటకం, తాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం
Image Credit : our own

పర్యాటకం, తాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం

రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టూరిజం పాలసీలో కీలక మార్పులు చేశారు. భారీ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని నిర్ణయించారు. 20 వేల మంది వరకు హాజరయ్యే ఈవెంట్లకు రూ.2 కోట్ల వరకు, 50 వేల మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అవసరమైతే ప్రభుత్వ స్థలాలను కూడా ఉచితంగా కేటాయించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలు అమలు చేయనుంది.

45
అమరావతి రైతులకు ఊరట..
Image Credit : our own

అమరావతి రైతులకు ఊరట..

రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు పలు రాయితీలు ప్రకటించింది. 2026 జనవరి 6కు ముందు తీసుకున్న సాగు రుణాల్లో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ వర్తించనుంది. అలాగే భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. మెట్ట భూములకు ఏడాదికి రూ.40 వేల వరకు, జరీబు భూములకు రూ.60 వేల వరకు కౌలు చెల్లించనున్నారు. పర్యాటక రంగంలో భాగంగా నెల్లూరులో ITC హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

55
సోషల్ మీడియా దుష్ప్రచారంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
Image Credit : our own

సోషల్ మీడియా దుష్ప్రచారంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

కేబినెట్ సమావేశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అభ్యంతరకర పోస్టులపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని, అదే సమయంలో భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అదనంగా విశాఖపట్నంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మరింత స్పష్టమైన సమాచారం అందేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. అసలు జనసేనానికి ఏమైంది? టెన్షన్ లో అభిమానులు
Recommended image2
Now Playing
రాష్ట్రమంతా మొత్తుకొని చెప్తున్నా..ఈ వార్డెన్లు కు ఇంకా అర్థం కాదు || Food Commission Chairman
Recommended image3
Now Playing
భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం | CM Chandrababu Resolves 22A Land Issue
Related Stories
Recommended image1
అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు
Recommended image2
Beer: ఫుల్లుగా బీర్లు తాగుతున్నారు.. అయినా కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. అసలేం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved