MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదిరిపోయే న్యూస్‌..80 శాతం రాయితీతో డ్రోన్‌ లు..కేవలం 7 నిమిషాల్లోనే!

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదిరిపోయే న్యూస్‌..80 శాతం రాయితీతో డ్రోన్‌ లు..కేవలం 7 నిమిషాల్లోనే!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికంగా ముందడుగు వేస్తోంది. అందుకోసం 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్లును అందించనుంది. దీనివల్ల ఖర్చులు తగ్గి, ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవడంతో సేద్యం మరింత లాభసాటి అవుతోంది.

1 Min read
Bhavana Thota
Published : Jun 13 2025, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వ్యవసాయాన్ని లాభసాటి చేసే దిశగా ఏపీ తొలి అడుగు
Image Credit : Freepik-ArthurHidden

వ్యవసాయాన్ని లాభసాటి చేసే దిశగా ఏపీ తొలి అడుగు

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు డ్రోన్లు అందిస్తోంది. సాగుకు సాంకేతికతను జోడించి ఖర్చులు తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

27
80% సబ్సిడీతో డ్రోన్ల పంపిణీ
Image Credit : our own

80% సబ్సిడీతో డ్రోన్ల పంపిణీ

 ఒక్కో డ్రోన్ యూనిట్‌ ధర రూ.9.80 లక్షలు కాగా, రైతులు కేవలం రూ.1.96 లక్షలు మాత్రమే చెల్లించాలి. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వం భరిస్తోంది. బ్యాంకుల ద్వారా రైతుల వాటాను రుణంగా మంజూరు చేసి, ఆ మొత్తం డ్రోన్ కంపెనీలకు చెల్లించనుంది.

Related Articles

Related image1
Agriculture Loans: మీకు ఈ అర్హతలుంటే ఈజీగా లోన్ పొందవచ్చు .. ఇందుకోసం మీరు చేయాల్సిందిదే
Related image2
Farmers support: రైతులకు గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరకు భారీ ప్యాకేజ్
37
జిల్లాల వారీగా డ్రోన్ల పంపిణీ
Image Credit : X

జిల్లాల వారీగా డ్రోన్ల పంపిణీ

 రాష్ట్రానికి మొత్తం 875 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఐదుగురు సభ్యుల రైతు గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి, వారిలో ఒక్కొక్కరికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక శిక్షణ కల్పించింది.

47
కేవలం 7 నిమిషాలు మాత్రమే
Image Credit : X

కేవలం 7 నిమిషాలు మాత్రమే

  ఒక ఎకరంలో డ్రోన్‌ ద్వారా పురుగుమందులు పిచికారీ చేయడానికి కేవలం 7 నిమిషాలే పడుతుంది. అదే పని మనుషులు చేస్తే 2 గంటలకుపైనే అవసరం. డ్రోన్‌ 12 లీటర్ల నీటితో పని చేస్తే, మనుషులు 100 లీటర్ల దాకా వాడాల్సి వస్తుంది.

57
తక్కువ ఖర్చుతో అధిక లాభం
Image Credit : X

తక్కువ ఖర్చుతో అధిక లాభం

డ్రోన్‌తో మందు పిచికారీ చేయించేందుకు ఎకరాకు రూ.350 ఖర్చు వస్తుంది. అదే మనుషులైతే కనీసం ఇద్దరు కూలీల ఖర్చు పడుతుంది. డ్రోన్‌ నేరుగా మొక్కలపై మందు చల్లడంతో మందు వృథా తక్కువగా ఉంటుంది.

67
ఆరోగ్యానికి మేలు
Image Credit : X

ఆరోగ్యానికి మేలు

డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ వల్ల వ్యవసాయ కూలీల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానవులుగా చల్లితే ముక్కు, నోరు ద్వారా మందులు శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, జీర్ణాశయం, శ్వాసవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

77
డ్రోన్ ప్రత్యేకతలు
Image Credit : X

డ్రోన్ ప్రత్యేకతలు

 ఈ డ్రోన్ బరువు ట్యాంకుతో కలిపి 29 కిలోలు ఉంటుంది. ఒకరోజులో 10 ఎకరాల వరకు మందు పిచికారీ చేయగలదు. స్పష్టమైన టార్గెట్‌తో మందులు మొక్కలపై పడటంతో మూడింతల ప్రయోజనం లభిస్తుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved