MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఎకరానికి 99 వేల రూపాయలు... చంద్రబాబు సర్కార్ బంపరాఫర్

ఎకరానికి 99 వేల రూపాయలు... చంద్రబాబు సర్కార్ బంపరాఫర్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇంతకూ ఆ పథకం ఏమిటో తెలుసా? 

2 Min read
Arun Kumar P
Published : Jul 25 2024, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Atchannaidu

Atchannaidu

Amaravathi : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాడి రైతులే కాదు ఇతర చిన్న,సన్నకారు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పోందవచ్చని తెలిపారు. పాల దిగుబడి పెంచడంతో పాటు రైతుల సంక్షేమంలో భాగమే 'ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు' పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి వెల్లడించారు. 

25
Farmer

Farmer

పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేలా ఈ పథకం వుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకంలో చేరాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని మంత్రి సూచించారు. 
 

35
Farmer

Farmer

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు"  పథకం అమలు చేసామని మంత్రి తెలిపారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిలిపివేసారని అన్నారు. ఈ పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి పాడి రైతులను ఇబ్బందులకు గురి చేశారని అచ్చెన్నాయుడు అన్నారు.
 

45
Farmer

Farmer

ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు పశుగ్రాసం పెంచడానికి అర్హులని తెలిపారు. తమ భూమిలో కనీసం 25 సెంట్ల నుండి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచవచ్చని తెలిపారు. నిర్ణీత పొలంలో దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం,నీటి సరఫరా మరియు ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం ప్రభుత్వమమే అందిస్తుందని అన్నారు. 
 

55
Farmer

Farmer

ఈ పథకం ద్వారా పశుగ్రాసం పండించిన రైతుకు ఎకరాకు రూ.99వేల లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved