MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: న‌న్ను, ప‌వ‌న్‌ను తిట్టేందుకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.? చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Andhra pradesh: న‌న్ను, ప‌వ‌న్‌ను తిట్టేందుకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.? చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Andhra pradesh: మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ప‌లు అంశాలపై మాట్లాడారు. త‌న‌తో పాటు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిట్ట‌డానికి వైసీపీ కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 05 2026, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దుష్ప్రచారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపణ
Image Credit : Asianet News

దుష్ప్రచారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపణ

తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికల్లో విమర్శలు చేయడానికి కొన్ని గ్రూపులకు ప్రత్యేకంగా నిధులు అందుతున్నాయని అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారని, హింస, అసభ్యకర వ్యాఖ్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుప్పం రూపురేఖలు మారుతున్నాయి..
Image Credit : Asianet News

కుప్పం రూపురేఖలు మారుతున్నాయి..

కుప్పం నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రహదారులు, రవాణా, కమ్యూనికేషన్, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే పూర్తిగా మారిన కుప్పాన్ని ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. కేవలం కుప్పమే కాదు, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

Related Articles

Related image1
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
Related image2
Doorbell: పాత ఇళ్ల‌కు కూడా సెట్ అవుతుంది.. వైర్లు లేకుండా ప‌నిచేసే స్మార్ట్ డోర్‌బెల్
35
క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి స్టీల్ పరిశ్రమల వరకు పెట్టుబడులపై దృష్టి
Image Credit : X/JanaSenaParty

క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి స్టీల్ పరిశ్రమల వరకు పెట్టుబడులపై దృష్టి

రాష్ట్రంలో అధునాతన సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రముఖ స్టీల్ కంపెనీలు ఆర్సెలార్ మిత్తల్, జేఎస్‌డబ్ల్యూ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

45
భూసమస్యల పరిష్కారం, పరిశ్రమలకు ప్రోత్సాహం
Image Credit : ANI

భూసమస్యల పరిష్కారం, పరిశ్రమలకు ప్రోత్సాహం

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. గతంలో కొన్ని భూకేటాయింపులు వివాదాలకు దారితీయడంతో విలువైన భూములు, ఖనిజ వనరులు సద్వినియోగం కాకుండా పోయాయని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు కూడా ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు.

పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడులను నిరుత్సాహపరిచే విధానాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి ప్రాజెక్టులను ఇతరులు తమ విజయాలుగా చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

55
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
Image Credit : Social Media

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా ఇప్పటికే కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే గాలేరు-నగరి ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్ర ప్రగతిని ఎలాంటి అడ్డంకులు ఆపలేవని చంద్రబాబు స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Related Stories
Recommended image1
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
Recommended image2
Doorbell: పాత ఇళ్ల‌కు కూడా సెట్ అవుతుంది.. వైర్లు లేకుండా ప‌నిచేసే స్మార్ట్ డోర్‌బెల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved