పవన్ కళ్యాణ్, లోకేష్, షర్మిల లేకుండానే జగన్పై సినిమా..
సీఎం జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రధానంగా `యాత్ర 2` సినిమాని తెరకెక్కిస్తున్న విసయం తెలిసిందే. ఇప్పుడు ఇందులో పెద్ద ట్విస్ట్ ఉందట. ఆ మూడు పాత్రలు ఉండటం లేదట.
![yatra 2 movie coming without pawan kalyan nara lokesh sharmila roles yatra 2 movie coming without pawan kalyan nara lokesh sharmila roles](https://static-ai.asianetnews.com/images/01hm5p38b06z1wh83azek08vsy/yatra2-pawan-kalyan-nara-lokesh-jpg_363x203xt.jpg)
జగన్పై సినిమా అంటే పవన్ కళ్యాణ్, లోకేష్ ల పాత్రలు కచ్చితంగా ఉండాల్సిందే. వర్మ అయితే అందరిని తీసుకొచ్చి సినిమా చేస్తాడు. పెద్ద డ్రామా క్రియేట్ చేస్తాడు. కానీ దర్శకుడు మహి వీ రాఘవ్ మాత్రం తనకు వారితో పనిలేదంటున్నాడు. వాళ్లు లేకుండానే జగన్పై సినిమా తీస్తున్నాడట. ఆయన ప్రస్తుతం `యాత్ర2` సినిమా చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లైఫ్పై ఈ మూవీ చేస్తున్నారు. ఆయన ఓదార్పు యాత్ర నుంచి సీఎం అయ్యేంత వరకు ఈ సినిమాలో చూపిస్తున్నారు. దీంతోపాటు తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని ప్రధానంగా చూపిస్తున్నారట.
అంతకు ముందు `యాత్ర` సినిమాని రూపొందించారు. అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నుంచి సీఎం అయ్యేంత వరకు ఆయన చేపట్టి పథకాలు, పాలన వరకు చూపించారు. ఇప్పుడు `యాత్ర2`లో వైఎస్ఆర్, జగన్ మధ్య బాండింగ్ని, దీంతోపాటు వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత ఏపీ ప్రజలను జగన్ ఓదార్చడం ప్రధానంగా సాగుతుంది. ఆయన సీఎం అయ్యేంత వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలను చూపించడం లేదట.
తండ్రికొడుకుల మధ్య ఎమోషన్స్ పై దర్శకుడు మహివీ రాఘవ్ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో మిగిలిన పాత్రలకు ప్రయారిటీ ఇస్తే ఆ ఎమోషన్ పక్కదారి పడుతుందని, ఆడియెన్స్ కి కనెక్ట్ కాదని ఆయన భావిస్తున్నారట. అందుకే ఆయా పాత్రలు లేకుండానే `యాత్ర 2` చేస్తున్నట్టు తెలుస్తుంది. `రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ చేసిన ప్రామిస్ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశం` అని టీమ్ తెలిపింది.
‘యాత్ర 2’లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. వై.ఎస్.భారతి రోల్లో కేతికా నారాయణన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 2009 నుంచి 2019 వరకు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రీసెంట్గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా ‘యాత్ర 2’ను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.