Asianet News TeluguAsianet News Telugu

ఈసారి చిరు,నాగ్ లతో పులిహార కలిపేసారు

 చిరంజీవి, నాగార్జున వంతు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రీమేక్ కాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు మొదలయ్యాయి. ఇది చాలదన్నట్లు ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికీ వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి వైరల్ చేస్తున్నారు. 

Will Chiranjeevi-Nagarjuna sizzle in a multi starrer
Author
Hyderabad, First Published Sep 27, 2021, 10:34 AM IST

కొన్ని వార్తలు నమ్మబుద్ది కావు, కానీ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాంటివే మీడియా వండి వడ్డిస్తూంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి విక్రమ్ వేద రీమేక్. ఈ రీమేక్ తెలుగులో అవుతుందో లేదో కానీ ప్రతీ మూడు నెలలకు స్టార్స్ ని మార్చి వార్తలు క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వంతు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రీమేక్ కాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు మొదలయ్యాయి. ఇది చాలదన్నట్లు ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికీ వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి వైరల్ చేస్తున్నారు. 

విలక్షణ నటుడు ఆర్.మాధవన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించగా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేదా’.. పుష్కర్- గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌ విక్రమ్, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌ వేద పాత్రల్లో నటించారు.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ.. విక్టరీ వెంకటేష్, నారా రోహిత్ పేర్లు వినిపించాయి కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారని అంటున్నారు.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అంటోంది మీడియా. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు సినిమావాళ్లు. అలాంటి ఆలోచనే ఎవరూ చేయటం లేదని చేస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటూ, మళయాళం రీమేక్ లూసిఫర్ లో కూడా నటిస్తున్నారు. దీన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మరో తమిళ సినిమా వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ లో కూడా చేస్తున్నారు.  నాగార్జున కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమాతో పాటూ, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ‘ద ఘోస్ట్’ లో కూడా నటిస్తున్నారు. విక్రమ్ వేద సినిమా హిందీ రీమేక్ లో సైఫ్ అలీఖాన్, హ్రుతిక్ రోషన్ నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios