Asianet News TeluguAsianet News Telugu

లైన్ లో ముగ్గురు.. శర్వా ఓటెవరికో..?

టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

what's next for sharwanand after 96 remake
Author
Hyderabad, First Published Jun 7, 2019, 4:49 PM IST

టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై శర్వా చాలా ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో '96' సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.

ప్రేమ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో సమంతహీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత శర్వా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

'భలే మంచి రోజు', 'దేవదాసు' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఇటీవల శర్వాకి ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత శర్వా ఈ సినిమాపై ఓ నిర్ణయానికి రానున్నాడు. అలానే కిషోరుడు అనే కొత్త దర్శకుడు శర్వాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ ఇద్దరితో పాటు మేర్లపాక గాంధీ కూడా శర్వానంద్ కి కథ చెప్పే పనిలో ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో శర్వానంద్ ఎవరికి ఓకే చెప్తాడనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios