Asianet News TeluguAsianet News Telugu

‘సలార్‌’లో ప్రభాస్ క్యారక్టర్, నేపథ్యం.. రెట్రో స్టోరీనా ?

పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు రూ. 150  కోట్ల బడ్జెట్‏తో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే సంస్థ నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్‏గా నటిస్తోంది.

what is Prabhas Role In Salaar? retro story?
Author
Bangalore, First Published Aug 18, 2021, 7:09 AM IST

 పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నారు..ఆయన  లుక్ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా సలార్ మూవీ గురించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.అందుతున్న సమాచారం మేరకు ‘సలార్‌’ ఓ మాస్ రెట్రో స్టోరీ అని తెలుస్తోంది.

కన్నడ మీడియా చెప్పేదాని ప్రకారం ఈ సినిమా 1970లో జరుగుతుంది. అప్పటి పాకిస్దాన్,ఇండియా వార్ నేపధ్యంలో ఉండబోతోంది. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడుగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఆ వార్ అయిన తర్వాత అతను గ్యాంగస్టర్ గా మారే వైనం, ఆ క్రమంలో జరిగే సంఘటనల చుట్టూ కథనం నడుస్తుందని చెప్పుకుంటున్నారు. . అలాగే  విజువల్ ట్రీట్ ఇచ్చే క్రేజీ ఎలివేషన్స్ తో ఫైట్ సీక్వెన్సులను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
 
గ్యాంగస్టర్ గా ప్రభాస్ కనిపించే సీన్స్ షూట్ చేసారని తెలుస్తోంది. సినిమాలో భారీ ఎలివేషన్ సీన్స్ అవి అని తెలుస్తోంది.  మరో ప్రక్క దర్శకుడు  ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే లో చిన్న మార్పులు చేశారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిన్న ప్లాష్ బ్యాక్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ లో ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపిస్తాడని.. ఈ ప్లాష్ బ్యాక్ మొత్తం చిత్రానికే హైలైట్‌ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ స్టార్..నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని, అదే కథలో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ అంటున్నారు. అప్పటిదాకా ఓ విధంగా నడిచిన కథ హఠాత్తుగా మలుపు తీసుకుంటుందని, ఆ ట్విస్ట్ కనుక వర్కవుట్ అయితే సినిమా స్దాయి చాలా రెట్లు పెరుగుతుందని అంటున్నారు. 

2021 లోపే ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.  ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios