ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన ‘విరాట పర్వం’.. ఎప్పుడు? ఎక్కడ?
టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ద్శకత్వంలో రానా - సాయి పల్లవి జంటగా వచ్చిన చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). థియేటర్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను పొందిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది.
టాలెంటెడ్ దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi), రానా దగ్గుబాటి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. ఈ మూవీ జూన్ 17న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వంతో తన మార్క్ చూపించగా.. Rana Daggubati, సాయి పల్లవి సహజంగా నటించి ఆడియెన్స్ ను మెప్పించారు.
1990లో తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమం నేపథ్యం చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ ఉద్యమ సమయంలోనే వరంగల్ కు చెందిన అభ్యుదయ వాది సరళ ప్రాణాలు కోల్పోతుంది. ఆమె జీవితాన్ని, ఉద్యమాన్ని చక్కగా చూపించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రావడంతో పలువురు నుంచి చిత్రానికి అభ్యంతరాలు కూడా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఏదేమైనా చిత్రం సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుంది. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రూ.15 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ కు నెట్ ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకున్నది సమాచారం. ఏదేమైనా ‘విరాటం పర్వం’ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. జూలై 1నుంచి నెట్ ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమింగ్ కానున్నది. ఇక ఈ చిత్రంలో రానా, సాయిపల్లవితో పాటు, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ కూడా నటించారు. సురేశ్ ప్రొడక్షన్ మరియు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.