విజయ్‌ దేవరకొండ ఇటీవల `లైగర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పరాజయంచెందింది. తాజాగా దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించారు.

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన సినిమాలు ఇటీవల వరుసగా పరాజయం చెందుతున్నాయి. `గీతగోవిందం` తర్వాత ఆయనకు హిట్‌ దక్కలేదు. `టాక్సీవాలా`, `నోటా`, `డియర్‌ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమల్‌ లవర్‌` చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో `లైగర్‌` పాన్‌ ఇండియాప్రయోగం చేశాడు విజయ్. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలై నిరాశ పరిచింది. 

నిజానికి ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విజయ్. సినిమా కోసం తన ప్రాణం పెట్టాడు. పాన్‌ ఇండియా వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకోవాలనుకున్నారు. అటు `ఇస్మార్ట్ శంకర్‌` సక్సెస్‌తో జోష్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌ సైతం ఈ సినిమాని ఎంతో నమ్మి చేశాడు. కానీ సినిమా పరాజయం చెందింది. అందరి ఆశలను గల్లంతు చేసింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈసినిమాతో అటు పూరీ, ఛార్మిలు సైతం సెలైంట్‌ అయ్యారు. విజయ్‌ తో చేయాల్సిన మరో సినిమా `జనగణమన` సైతం ఆగిపోయింది. 

ఈ నేపథ్యంలో ఇటీవల `లైగర్‌` రిజల్ట్ పై స్పందించారు విజయ్‌ దేవరకొండ. ఇటీవల బెంగుళూరులో జరిగిన `సైమా` వేడుకలో పాల్గొన్న విజయ్‌ `లైగర్‌` ఫెయిల్యూర్ పై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయ్‌ దేవరకొండ స్పీచ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మోస్ట్ ప్రామిసింగ్‌ అవార్డు అందుకున్న విజయ్‌ ఈ సందర్బంగా చెబుతూ, మనందరి జీవితంలో మంచి రోజులుంటాయి, చెడ్డరోజులుంటాయి. ఫెయిల్యూర్స్ మనకి బాధని కలిగించవచ్చు. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి` అని చెప్పాడు.

ఇంకా చెబుతూ, `నేను ఈ అవార్డు వేడుకకి రావాలనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడుతున్నాను. అలాగే త్వరలో మంచి సినిమాతో మీ అందరిని సంతోష పరుస్తానని ప్రామిస్‌ చేస్తున్నా. నా నుంచి త్వరలో గొప్ప సినిమా వస్తుంది` అని చెప్పారు విజయ్. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. 

Scroll to load tweet…