వెన్నెల కిశోర్ సైతం హీరోగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హీరోగా మెప్పించేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా `చారి 111` పేరుతో ఓ కామెడీ సినిమాని రూపొందిస్తున్నారు.
కమెడియన్లు హీరోగా సినిమాలు చేసి మెప్పించారు. బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అలీ, బాబు మోహన్, సునీల్, వేణు మాధవ్ వంటి వారు హీరోగా నటించి విజయాలు అందుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో హీరోలుగా సర్వైవ్ కాలేదు. అడపాదడపా అవకాశాలు వచ్చినప్పుడు హీరోగా చేసి, తర్వాత కమెడియన్లుగా కొనసాగారు. ఇప్పుడు వెన్నెల కిశోర్ సైతం హీరోగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హీరోగా మెప్పించేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా `చారి 111` పేరుతో ఓ కామెడీ సినిమాని రూపొందిస్తున్నారు.
గూఢచారి నేపథ్యంలో యాక్షన్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. దీనికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన సుమంత్ హీరోగా `మళ్లీ మొదలైంది` అనే చిత్రాన్ని రూపొందించారు. కొంత గ్యాప్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ఘా నటిస్తుంది. మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. నేడు బుధవారం(ఆగస్ట్ 23)న ఈ సినిమాని ప్రకటిస్తూ కాన్సెప్ట్ టీజర్ని విడుదల చేశారు.
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్ఫ్యూజ్డ్ స్పై చారి పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.
'చారి 111' గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో 'వెన్నెల' కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది'' అని చెప్పారు.
చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది'' అని చెప్పారు.
'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.
