ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్..

వరసపెట్టి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఆ కోవలో విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 కూడా రెడీ అవుతోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎప్ 2 సినిమాకు సిక్వెల్‏గా ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రవిపూడి. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా.. మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్..

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. సమ్మర్ సోగాళ్లు అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు.. ఎఫ్ 2 స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు అని గతంలోన క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…

 ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత వెంకటేష్‌లోని ఫన్ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2 పేరు తెచ్చుకుంది. మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏ స్దాయిలో ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు సక్సెస్ ల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.

ఎఫ్‌2 సూపర్‌ హిట్‌ కావడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్‌3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.