ప్రీ లుక్ ఇలా ఉందంటే..ఇంక నెక్ట్స్ ఎలా ఉంటుందో!
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్సీ 22 (#NC22)గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ ప్రీ లుక్ చూసిన వారంతా అద్బుతంగా ఉందని, చాలా ఇంటెన్స్ తో ఉందని మెచ్చుకుంటున్నారు.
నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
సమంతతో విడాకుల తర్వాత చైతూ కూడా తన కెరీర్పై ఫోకస్ పెట్టారు. మజిలీ, వెంకీ మామ, లవ్స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్లోనూ ఆమీర్ ఖాన్తో కలిసి చేసిన లాల్ సింగ్ చద్ధా చిత్రంలోనూ నటించాడు మన చైతూ. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే ఈ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సారి తమిళ దర్శకుడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అక్కినేని అభిమానులను దృష్టిలో ఉంచుకుని మంచి కమర్షియల్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు చైతూ.
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.రీసెంట్గా నాగచైతన్య చేసిన థ్యాంక్యూ చిత్ర డిజాస్టర్ కావటం, అలాగే లాల్ సింగ్ చద్ధా అదే పరిస్దితి ఎదురుకావటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నాడు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నై 600028, సరోజ, గోవా, మనకథా లాంటి చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది శింబుతో చేసిన మానాడు చిత్రం ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తెలుగులోనూ ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.