హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లెప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మ్యారేజ్ డేట్, ప్లేస్ వంటి అంశాలపై ఆయన ఓపెన్ అయ్యారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాయి. ఆయన ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లెప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దానికోసం అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే మ్యారేజ్ డేట్పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. తాజాగా దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మ్యారేజ్ డేట్, ప్లేస్ వంటి అంశాలపై ఆయన ఓపెన్ అయ్యారు.
మ్యారేజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. నవంబర్లోగానీ, డిసెంబర్లోగానీ ఉండే అవకాశం ఉందన్నారు. అయితే మ్యారేజ్ డేట్ని ఫిక్స్ చేసేది మాత్రం తన అమ్మనే అట. ఆమె చేతుల్లోనే డేట్ని ఖరారు చేయాల్సిందన్నారు. మరోవైపు మ్యారేజ్ చేసుకునే ప్లేస్ గురించి ఆయన రియాక్ట్ అవుతూ, మ్యారేజ్ ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటున్నారట. అది మన హైదరాబాద్ సాధ్యం కాదని, అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇండియాలో మూడు ప్లేస్లను, విదేశాల్లో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఓ ప్రాంతాన్ని ఫైనల్ చేస్తామన్నారు వరుణ్ తేజ్. ముందు డేట్ అనుకున్నాక, ప్లేస్ని డిసైడ్ చేస్తామన్నారు.
ఈ సందర్భంగా లవ్ ప్రపోజల్ గురించి వరుణ్ తేజ్ చెబుతూ, ముందు లావణ్య త్రిపాఠినే ఈ లవ్ ప్రపోజల్ పెట్టిందట. తాను ఓకే చెప్పినట్టు తెలిపారు. తాను వాడుతున్న ఫోన్ని కూడా లావణ్య గిఫ్ట్ గా ఇచ్చిందని వెల్లడించారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదట `మిస్టర్` చిత్రంలో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత `అంతరిక్షం` చిత్రంలో నటించారు. ఆ టైమ్లో ప్రేమ మరింత బలపడింది. స్నేహితులుగా స్టార్ట్ అయి ప్రేమికులుగా మారినట్టు వెల్లడించారు. జూన్9న ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ `గాంఢీవధారి అర్జున` చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వరుణ్కి జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్ఘా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
