తెలుగులో వరుణ్ ధావన్ ‘భేదియా’.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో విడుదల.!
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ కు అందించబోతున్నారు. వరుణ్ ధావన్ నటించిన ‘భేదియా’ (తోడేలు) చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటించిన చిత్రం ‘భేదియా’. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కామెడీ హార్రర్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయనున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేశారు. రీసెంట్ గా ఈ సంస్థ రీసెంట్ గా ‘కాంతార’ (Kantara) చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో హారర్-కామెడీ యూనివర్స్ లోని ‘భేదియా’ను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్దమవుతున్నారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.
ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ ధావన్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. మరో నిర్మాత బన్ని వాసు ఆలోచనను, అల్లు అరవింద్ నిజం చేస్తూ, ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో కాంతార తెలుగు వెర్షన్ను విడుదల చేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నారు.