ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'వాల్మీకి' సినిమాను సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సినిమాకు సంబంధించిన టీజర్ ని
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది.
వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. తమిళ హీరో అధర్వ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజాహెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగార్తండా' సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. బోయ వర్గానికి చెందిన వారు సినిమా టైటిల్ మార్చాలని లేకపోతే షూటింగ్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకసారి షూటింగ్ స్పాట్ కి వెళ్లి చిత్రీకరణ ఆపేలా చేశారు. ఇప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సినిమాకు సంబంధించిన టీజర్ ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ లుక్ ని విడుదల చేసింది. ఐదు తలలతో వరుణ్ తేజ్ లోని విభిన్న కోణాలను చూపిస్తున్న ఈ పోస్టర్ భయపెట్టేలా ఉంది. వరుణ్ తేజ్ ఎక్స్ ప్రెషన్స్, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 13, 2019, 12:26 PM IST