గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాజ్‌పేయ్ గురువారం సాయంత్రం కన్నుమూశారు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాజ్‌పేయ్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనలో నాయకత్వ లక్షణాలతో పాటు మంచి కవి కూడా ఉన్న సంగతి తెలిసిందే. అలానే వాజ్‌పేయ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాటలను ఇష్టంగా వింటారట. క్లాసికల్ ఆర్టిస్టులు భీంసేన్ జోషి, అంజాద్ అలీ ఖాన్, హరి ప్రసాద్ లంటే వాజ్‌పేయ్ కి చాలా ఇష్టమట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలానే లతా మంగేష్కర్, ముఖేష్, ఎస్.డి బర్మాన్ ల పాటలను ఇష్టంగా వినేవారని తెలుస్తోంది. 'ఓ మేరా మాజీహీ', 'సన్ మేరె బంధు', 'కభీ కభీ మేరె దిల్ మే' పాటలను పదే పదే వినేవారని చెబుతున్నారు. ఆయనకు ఇష్టమైన సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్. సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, సుచిత్ర సేన్, రాఖీ, నూతన్ వంటి నటులు ఆయన ఫెవరెట్ యాక్టర్స్.

దేవదాస్, బాందిని, తీశ్రీ కోసం, మౌసమ్ సినిమాలను రిపీటెడ్ గా చూసేవారట. "Bridge Over the River Kwai", ''Born Free", "Gandhi" వంటి ఇంగ్లీష్ సినిమాలను అయన చూసేవారు.