Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండతో మైత్రి మూవీస్ ప్లాన్ ఏంటంటే..?

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది మైత్రి మూవీస్. 'సవ్యసాచి' సినిమా తప్ప ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే.. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను రూపొందిస్తున్నారు. చాలా మంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీస్. ఒకేసారి నాలుగైదు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. 

Top production house set for Bollywood Debut
Author
Hyderabad, First Published Nov 5, 2018, 4:15 PM IST

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది మైత్రి మూవీస్. 'సవ్యసాచి' సినిమా తప్ప ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే.. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను రూపొందిస్తున్నారు. 

చాలా మంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీస్. ఒకేసారి నాలుగైదు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీస్ ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరిస్తారని సమాచారం. బాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఆ దర్శకుడు సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మైత్రి మూవీస్ కి బాలీవుడ్ లో ఎలాంటి  గుర్తింపు లభిస్తుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios