బాలీవుడ్ కోడలుగా తెలుగు హీరోయిన్, ఘనంగా బాలయ్య భామ పెళ్లి..
బాలీవుడ్ కు కోడలుగా వెళ్తోంది... టాలీవుడ్ హీరోయిన్. తెలుగులో వరుస సినిమాలు చేసిన బ్యూటీ.. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ తో లవ్ లో పడింది. తాజాగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.
![Tollywood Heroine Aksha Pardasany wedding with Bollywood Cinematographer Kaushal JMS Tollywood Heroine Aksha Pardasany wedding with Bollywood Cinematographer Kaushal JMS](https://static-ai.asianetnews.com/images/01hqmac7qt9sncmm8hgha29stx/1-jpg_363x203xt.jpg)
టాలీవుడ్ లో వరుసగాసినిమాలు చేసింది అక్ష పార్ధసాని. తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెందిన కౌశల్ తో ప్రేమలో పడింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన అక్ష పార్ధసాని సినిమాటోగ్రఫర్ ప్రేమలో మునిగి తేలింది.
తెలుగులో అన్నిసినిమాలు చేసినా.. 2017 తరువాత నుంచి ఆమెకు పెద్దగా ఆఫఱ్లు రాలేదు. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోవడంతో వెంటనే ఆమె చూపు బాలీవుడ్ వైపు పడింది. హైదరాబాద్ నుంచి మకాం ముంబైకి మార్చేసిన అక్షజజ అక్కడే బాలీవుడ్ లో ఉంటూ అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.
అక్కడ పనిచేసే టైమ్ లోనే హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ప్రేమలో పడింది. తాజాగా వీరి ప్రేమను పెళ్ళి బంధంగా మార్చుకున్నారు కూడా. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి నిన్న అనగా ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
అయితే ఈ పెళ్ళికి పెద్దగా హంగామాచ చేయకుండా.. ఇరు కుటుంబాలతో పాటు చాలా దగ్గర సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లి ఫోటోలని అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అయితే ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్ గా మారింది.
కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో తన ఎంట్రీని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఏ గుర్రంమీదనో.. కార్లోనో కాకుండా.. షూటింగ్స్ కి వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లి మండపం దగ్గరకు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నిజమైన సినిమాటోగ్రఫర్ అంటే నువ్వే బాసు అంటే సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.