‘మహర్షి’: ఈ రోజే అసలైన పరీక్ష,పాసైతే పండగే
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘మహర్షి’ సినిమా మంచి టాక్తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘మహర్షి’ సినిమా మంచి టాక్తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం విడుదలైన ఈ చిత్రం ఈ వీకెండ్ లో బాక్సాఫీసు వద్ద సక్సెస్ ఫుల్ గా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే వేవ్ కంటిన్యూ అయితే వందకోట్ల మార్క్ ని ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. మహేష్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమాని ఆయన పేర్కొన్నారు.
అయితే అదే సమయంలో టీమ్ అంతా ఈ రోజు కలెక్షన్స్ వైపు ఆసక్తిగా ఒకింత టెన్షన్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబడితే ఇంక తిరుగులేదు. నిజమైన పరీక్ష ఈ రోజే. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి కానీ లెక్కలు తెలియవు. దాన్ని బట్టే ప్రమోషన్స్ పెంచాలా...ట్రైలర్స్ మార్చాలా ..వాట్ నెక్ట్స్ అనేది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్రాజు, ప్రసాద్ వి పొట్లూరి, అశ్వినీదత్ నిర్మాతలుగా వ్యవహరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. మహేష్ నటన, కథ, వంశీ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని చిత్రం టీమ్ ని ప్రముఖులతోపాటు నెటిజన్లు ప్రశంసించారు.