`టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదలయ్యాయి. మరో అప్‌డేట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది యూనిట్‌. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. 

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja)హీరోగా నటిస్తున్న భారీ మూవీ `టైగర్‌ నాగేశ్వరరావు`(Tiger Nageswara Rao). ఆయన నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు జీవిత కథతో రూపొందుతుంది. పీరియాడికల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదలయ్యాయి. మరో అప్‌డేట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది యూనిట్‌. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఆగస్ట్ 17న గురువారం `టైగర్‌ నాగేశ్వరరావు` టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. తాజాగా శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సర్‌ప్రైజ్‌ ఉంటుందని భావించారు. కానీ రెండు రోజులు ఆలస్యంగా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. టైగర్ దాడి అప్పుడే అంటూ చిత్ర బృందం ఈ అప్‌డేట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ ని విడుదల చేశారు. ఇందులో రవితేజ కాళ్లు కట్టేసినట్టు ఉంది. ఆయన యాక్షన్‌లోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని టాక్. 

ఇక వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కావడం ఓ విశేషమైతే, ఆయన తొలి పాన్‌ ఇండియా మూవీ కావడం మరో విశేషం. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్‌ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఇక నెమ్మదిగా ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన `నూపూర్‌ సనన్, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 

Scroll to load tweet…

ఇక రవితేజ చివరగా `రావణాసుర` చిత్రంలో నటించాడు. ఇది పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. సుశాంత్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా వంటి వారు నటించినా ఫలితం లేదు. సుధీర్‌ వర్మ రూపొందించిన ఈచిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి అయ్యింది. అంతకు ముందు మాస్‌ రాజా `ధమాఖా`తో బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్న విషయం తెలిసిందే.