కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు. హౌస్ లో జరిగిన శివాజీ, షకీలా, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ సందడితో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా కనిపించింది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా ప్రవేశించిన నవీన్ పోలిశెట్టి హంగామా నేడు కూడా కొనసాగింది. డార్క్ రూమ్ లోకి ప్రవేశించిన నవీన్ కాసేఫు కంటెస్టెంట్స్ ని ఆటపట్టించాడు. శోభా శెట్టి నేను శెట్టి అంటూ పోలిశెట్టితో పరిచయం చేసుకుంది. దీనితో నవీన్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. వెంటనే నవీన్ పోలిశెట్టి కంటెస్టెంట్స్ చేత దగ్గరుండి పులిహోర కలిపించే ఫన్నీ టాస్క్ పెట్టాడు. లేడీ లక్ అంటూ తమకు ఇష్టమైన లేడీ కంటెస్టెంట్స్ కి జెంట్స్ తో బ్యాండ్స్ కట్టించాడు.
పల్లవి ప్రశాంత్.. రతికకి బ్యాండ్ కడుతూ తెగ సిగ్గుపడిపోయాడు. ఎందుకు ఆమెకి బ్యాండ్ కట్టావు అని ప్రశ్నిస్తే ఆమె నాతో మంచిగా మాట్లాడింది అంటూ తెగ సిగ్గు పడ్డాడు. రతిక కూడా ప్రశాంత్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఇద్దరూ మాటలతో నెమ్మదిగా రొమాన్స్ పెంచుతున్నారు.
ఇక హీరో శివాజీ నిన్న నాగార్జున ఇచ్చిన 35 లక్షల ఆఫర్ గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. 35 లక్షలు వదులుకుని తప్పు చేశానని సరదాగా కామెంట్స్ చేశారు. ఇక రతిక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఆమెకి ఇచ్చిన టాస్క్ ప్రకారం అమర్ డీప్ కి, ప్రియాంక జైన్ కి మధ్య గొడవలు పెట్టాలి. అంటే పుల్లలు పెట్టాలి అన్నమాట. దీనితో శోభా శెట్టి, ప్రశాంత్ ని సంప్రదించగా వారిద్దరూ చేయలేమని చెప్పారు. చివరికి టేస్టీ తేజ ఒప్పుకున్నాడు.
అయితే టేస్టీ తేజ షకీలాని బోల్డ్ ప్రశ్నతో కెలికి బుక్కయ్యాడు. మీరు అవకాశాలు లేక అడల్ట్ సినిమాలు చేశారా లేక కావాలనే ఇష్టంతోనే ఆ తరహా చిత్రాలు చేశారా ? ఆ పాత్రలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది ? మీ కుటుంబ సభ్యులు ఏమి అనలేదా అని ప్రశ్నించాడు. ఏంట్రా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అంటూ షకీలా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నాకు ఆ తరహా పాత్రలు వచ్చాయి కాబట్టే చేశాను. గ్లామర్ సాంగ్స్ చేస్తే లేని తప్పు గ్లామర్ రోల్స్ చేస్తే తప్పేంటి అని షకీలా అభిప్రాయ పడింది. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఏమి అనలేదని ఎందుకంటే వాళ్ళకి డబ్బు వస్తోంది కదా అని బదులిచ్చింది.
అనంతరం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ముందుగా శివాజీని రూమ్ లోకి పిలిచారు. హౌస్ లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు పేర్లు చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీనితో శివాజీ డాక్టర్ గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని లని నామినేట్ చేశారు. గౌతమ్ కృష్ణ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్, పైగా ట్యాలెంట్ కూడా ఉంది. కాబట్టి బయటకి వెళ్ళినా సర్వైవ్ కాగలడు. ఇక దామిని సింగర్ కాబట్టి ఆమెకి బయట అవకాశాలు వస్తాయి. ఈ కారణాలతోనే వీరిద్దరిని నామినేట్ చేసినట్లు శివాజీ తెలిపారు. అదే విధంగా ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతిక లని నామినేట్ చేసింది. వారిద్దరూ తనతో సరిగా మాట్లాడడం లేదని పేర్కొంది.
