Asianet News TeluguAsianet News Telugu

తమిళ హీరో కార్తీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జపాన్’.. పూజా కార్యక్రమంతో ఈరోజే మొదలు.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. రీసెంట్ గా ‘సర్దార్’తో మెప్పించి విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో పాటు పూజా కార్యక్రమంతో ఈరోజే ప్రారంభించారు.
 

Tamil hero Karthis next project Japan begin today wihg pooja, details!
Author
First Published Nov 8, 2022, 2:47 PM IST

తెలుగు ప్రేక్షకుల్లో కోలీవుడ్ హీరోలకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అందులో తమిళ హీరో కార్తీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చెన్నైలో పుట్టి  పెరిగినా.. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలగడంతో తెలుగు తంబీలకు కార్తీ మరింత దగ్గరయ్యారు. దీంతో  కార్తీ మార్కెట్ కూడా పెరిగిపోయింది. ‘ఆవారా’తో స్టార్ట్ అయిన ఆయన జర్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కొనసాగుతూనే ఉంది. రీసెంట్ కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంకా సినిమా సందడి కొనసాగుతుండగానే తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 

ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ డైరెక్షన్ లో కార్తీ తన 25 సినిమాను చేస్తున్నాడు. ఈ రోజే చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఘనంగా పూజాకార్యక్రమాలను నిర్వహించి మొదలు పెట్టారు. చిత్రంలో ఇటీవల ‘ఊర్వసివో రాక్షసివో’తో ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నటిస్తోంది. తమిళంలో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తూ జాతీయ అవార్డును దక్కించుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, మరియు ఎస్ఆర్ ప్రభు 'జపాన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
మునుపెన్నడూ చూడని పాత్రలు, వాటి సమస్యలు, సామాజిక విలువలను నిలబెట్టే పరిష్కారాలను దర్శకుడు రాజు మురుగన్ తన చిత్రాల ద్వారా చెబుుతుంటారు. వినోదం మరియు సామాజిక బాధ్యత ఒకదానితో ఒకటి ముందుకు సాగుతుందని తన సినిమాలతో నిరూపించారు. ఇక 2007లో హీరోగా అరంగేట్రం చేసిన కార్తీ విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే ‘జపాన్’ చిత్రం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఇక అతి త్వరలోనే 'జపాన్' ఫస్ట్ లుక్ విడుదల కానుందని తెలుస్తోంది. 

'జపాన్' చిత్ర పూజా కార్యక్రమం ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుందని అనౌన్స్ చేశారు. దర్శకుడు రాజు మురుగన్ వ్యక్తిగతంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఇక చిత్రంలో కమెడియన్, నటుడు సునీల్, కన్నడ నటుడు విజయ్ మిల్టన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంతోనే తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios