ప్రభాస్ 'కల్కి'పై ఇంకాస్త అంచనాలు పెంచేసిన స్వప్న దత్.. లేటెస్ట్ కామెంట్స్ వైరల్
గత ఏడాది చివర్లో సలార్ చిత్రంతో అలరించిన ప్రభాస్ ఈ ఏడాది యావత్ దేశం ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కితో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
గత ఏడాది చివర్లో సలార్ చిత్రంతో అలరించిన ప్రభాస్ ఈ ఏడాది యావత్ దేశం ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కితో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
కల్కి 2898 నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. తాజాగా అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ కల్కి చిత్రంపై ఇంకాస్త అంచనాలు పెంచేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో స్వప్న దత్.. ప్రభాస్ కల్కి చిత్రం గురించి మాట్లాడారు.
స్వప్న మాట్లాడుతూ.. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం ఉండిపోతుంది అని తెలిపింది. ఈ చిత్రం సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది అని తెలిపింది. అయితే మే 9న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా కాదా అనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తొలగిస్తూ కల్కి చిత్రం మే 9 రిలీజ్ కి రైట్ ట్రాక్ లో సిద్ధం అవుతోంది అని స్వప్న క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల నాగ్ అశ్విన్ ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి వివరిస్తూ.. ఈ మూవీ మహా భారతంలో మొదలై 2898 లో ముగుస్తుంది. మొత్తం 6 వేల సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రం సాగుతుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు. హాలీవుడ్ చిత్రం బ్లెడ్ రన్నర్ తో ఈ చిత్రానికి పోలికలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో భారత దేశం ఎలా ఉంటుందో ఊహించి అందుకు తగ్గట్లు సెట్స్ వేసినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.