మెగాహీరోకి అమెరికాలో ఆపరేషన్!
మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సాయి ధరం తేజ్. మొదట్లో వరుస విజయాలు అందుకున్న ఈ హీరో ఆ తరువాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా పరాజయాలను చవిచూడక తప్పలేదు.
మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సాయి ధరం తేజ్. మొదట్లో వరుస విజయాలు అందుకున్న ఈ హీరో ఆ తరువాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా పరాజయాలను చవిచూడక తప్పలేదు.
వరుస ఆరు ఫ్లాప్ సినిమాలు పడడంతో డీలా పడిపోయాడు. దీంతో తన తదుపరి సినిమాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత చిత్రాల్లో ధరం తేజ్ చాలా లావుగా కనిపిస్తున్నాడనే విమర్శలు వినిపించాయి. దీంతో బరువు తగ్గే ప్రయత్నంలో ఇప్పుడు లైపో సెక్షన్ చేయించుకుంటున్నాడని సమాచారం.
అందులో భాగంగామే తేజు అమెరికాకి వెళ్లాడని, ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడుతున్నాడని అంటున్నారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత అతడు ఇండియాకి తిరిగి రానున్నాడు.నిజానికి సినిమాల్లోకి రాకముందు నుండే తేజు చాలా లావుగా ఉండేవాడు. కానీ శ్రమతో తన శరీర బరువు తగ్గించుకున్నాడు.
ఈ మధ్య కాలంలో బరువు పెరుగుతుండడంతో మళ్లీ తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 'చిత్రలహరి' సినిమా ఒక్కటే ఉంది. ఆ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. తన కొత్త లుక్ కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.