సుకుమార్.. విజయ్ దేవరకొండకి హ్యాండిచ్చినట్టేనా?.. ఆ వార్తలు చూస్తే నిజమే అనాల్సిందే?
విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు సుకుమార్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటి వరకు దీనిపై అప్ డేట్ లేదు. కానీ ఈ మూవీ ఆగిపోయిందా అనే చర్చ మొదలైంది.
దర్శకుడు సుకుమార్ రేంజ్ మారిపోయింది. `పుష్ప`తో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు `పుష్ప2`తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్నే టార్గెట్ చేశాడు. ఈ మూవీతో గట్టిగానే కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెంట్ డేకి రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఓ విధంగా క్లారిటీ వచ్చినట్టే అనే చర్చ మొదలైంది.
Poll: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
సుకుమార్ నెక్ట్స్ రామ్చరణ్తో చేయబోతున్నారట. ప్రస్తుతం చరణ్.. `గేమ్ ఛేంజర్`లో బిజీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితమే `ఆర్సీ16` బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ని కూడా వెంటనే స్టార్ట్ చేయబోతున్నారట. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని అటు `గేమ్ చేంజర్`, ఇటు బుచ్చిబాబు మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు రామ్చరణ్. ఇక నెక్ట్స్ ఆయన సుకుమార్తో చేయబోతున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్లో `రంగస్థలం` చిత్రం వచ్చి పెద్ద హిట్ అయ్యింది.
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందట. సుకుమార్ నెక్ట్స్ మూవీ ఇదే అని అంటున్నారు. ఆ తర్వాత `పుష్ప3` ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే `పుష్ప`కి మూడో పార్ట్ పై హింట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పలు ఈవెంట్లలో ఈ విషయాన్ని తెలిపారు. సుకుమార్ కూడా తెలిపారు. చాలా పార్ట్ లు తీసేంత కథ ఉందన్నారు. సిరీస్లా తీయోచ్చన్నారు. కానీ `పుష్ప3`ని మాత్రం రామ్చరణ్ మూవీ తర్వాత తెరకెక్కిస్తారట. `పుష్ప2` రిలీజ్ అయిన వెంటనే సుక్కు మాస్టర్ చరణ్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కాబోతున్నారనేది బలంగా వినిపించే మాట.
అయితే విజయ్ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించారు సుకుమార్. `పుష్ప` ప్రారంభ సమయంలోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. `పుష్ప` తర్వాత విజయ్తో మూవీ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇది ఆగిపోయిందని మధ్య వార్తలు కూడా వచ్చాయి. అది నిజం కాదని టీమ్ స్పందించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. `పుష్ప`ని ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావించలేదు. అలాగే విజయ్ దేవరకొండ `లైగర్` తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోతాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా బెడిసి కొట్టింది. దీంతో సుకుమార్ లెక్కలు మార్చేశాడు. `పుష్ప2`పై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు తన రేంజ్ మారడంతో ఆ `రేంజ్` లెక్కలు కూడా మార్చేశాడు. ఈ క్రమంలో విజయ్ మూవీ పక్కకి వెళ్లిపోయిందని, ఇక ఇది ఉండబోదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఏం ఉన్నా మరో రెండు మూడేళ్ల వరకు సుకుమార్ బిజీ. ఆ తర్వాత పరిణామాలుఎలా ఉంటాయో చూడాలి.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేస్తుంది. పరశురామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతోపాటు గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఆ తర్వాత నర్తన్ దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందంటున్నారు. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.