ఫిబ్రవరి 8న రిలీజ్ కానున్న యాత్ర బయోపిక్ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచింది. ఇక రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర యూనిట్ సినిమాకు మంచి ప్రచారమే చేసింది. వేడుకకి గెస్ట్ గా వచ్చిన సుదీర్ బాబు మాట్లాడిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫిబ్రవరి 8న రిలీజ్ కానున్న యాత్ర బయోపిక్ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచింది. ఇక రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర యూనిట్ సినిమాకు మంచి ప్రచారమే చేసింది. వేడుకకి గెస్ట్ గా వచ్చిన సుదీర్ బాబు మాట్లాడిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది కేవలం ఒక వర్గానికి చెందిన సినిమా కాదని అందరూ చూసే సినిమా అంటూ వైఎస్ అభిమానులు కాకపోయినా కూడా సినిమా నచ్చుతుందని అన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా చూసి స్ఫూర్తిగా తీసుకోవచ్చని అందరికి నచ్చే సినిమా అని మాట్లాడాడు. అంతే కాకుండా తన స్నేహితులు కొంత మంది ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ చేశారు. అలాగే ఇప్పుడు యాత్రకు కూడా పనిచేశారని నేను పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో చేస్తున్నట్లు సుదీర్ మాట్లాడారు.
ఇక ఈ సినిమా లో నటించిన మమ్ముంటి గారికి తాను పెద్ద అభిమానిని అంటూ ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని దర్శకుడు మహి వి రాఘవ ఎప్పుడు ఒక సైన్టిస్ట్ లా కనిపిస్తాడని ఈ సినిమాకు వర్క్ చేసిన చిత్ర యూనిట్ విషెష్ ను తెలియజేశారు
