హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ నుంచి సాలిడ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!
బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా సాలిడ్ అప్డేట్ అందింది. మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ అందించారు.
2017లో తమిళం భాషలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’(Vikram Vedha). తమిళ స్టార్స్ మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా, రెస్పాన్స్ పరంగా అదరగొట్టింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రిమేక్ ల పర్వం కొనసాగుతుండటంతో.. ‘విక్రమ్ వేదా’ను హిందీలోనూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 2020లోనే రిలయన్స్ మరియు టీ సిరీస్ సంస్థలు ఈ రీమేక్ ను ప్రకటించాయి. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కలిసి నటిస్తుండగా.. షుష్కర్ గాయత్రీ దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, అప్డేట్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవల టీజర్ రాగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ను అందించారు మేకర్స్. సెప్టెంబర్ 8న ‘విక్రమ్ వేదా’ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ యాక్షన్ కా బాప్ అనిపిస్తోంది. రీమేక్ వెర్షన్ మరింత అద్భుతంగా ఉండనుంది. తెలుస్తోంది.
పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహింస్తుండగా.. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ, హీరోయిన్లు రాధికా ఆప్టే (Radhika Apte) ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. టీ సిరీస్, రిలయన్స్ తోపాటు వైనాట్ స్టూడియోస్, ప్లాన్ సీ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని రూ.175 కోట్లతో మరింత అద్భుతంగా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.